విశ్వ క్రీడా టోర్నమెంట్‌ అయిన ఒలింపిక్స్‌(Olympics) మరి కొద్ది గంటల్లో మొదలు కాబోతున్నది.

విశ్వ క్రీడా టోర్నమెంట్‌ అయిన ఒలింపిక్స్‌(Olympics) మరి కొద్ది గంటల్లో మొదలు కాబోతున్నది. ఫ్రాన్స్‌(France) రాజధాని పారిస్‌(Paris) ప్రపంచ క్రీడామహోత్సవానికి ఆతిథ్యమివ్వడానికి సంసిద్ధమయ్యింది. ప్రారంభ వేడుకలో భాగంగా టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవి(chiranjeevi) ఫ్యామిలీ పారిస్‌కు చేరుకుంది. సతీమణి సురేఖ(surekha), కొడుకు రామ్‌చరణ్‌(Ram charan), కోడలు ఉపాసన(Upasana), గ్రాండ్‌ లిటిల్‌ వన్‌ క్లింకారాతో(Klinkara) లండన్‌లోని(London) హైడ్‌ పార్క్‌లో చక్కర్లు కొట్టి ఫోటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఇప్పుడు పారిస్‌ వీధుల నుంచి వెళుతున్న ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. చిరంజీవి, రాంచరణ్‌ స్టైలిష్‌ లుక్‌లో చిల్‌ అవుట్‌ మూడ్‌లో కనిపిస్తున్నారు. ఈ ఫోటోలు చూసి అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సోషియో ఫాంటసీ మూవీకి మల్లిడి వశిష్ట దర్శకత్వం వహిస్తున్నాడు. హీరోయిన్‌గా త్రిష నటిస్తోంది.

Eha Tv

Eha Tv

Next Story