అజయ్ భూపతి(Ajay Bhupathi) సినిమాతో సంచలనంగా మారింద పాయల్ రాజ్ పుత్(Payal Rajputh). ఆతరువాత ఆమెకు ఆరేంజ్ లో సాలిడ్ హిట్ పడలేదు. మళ్ళీ మధ్యలో ఎన్నో సినిమాలు చేసినా.. ఫలితం లేదు.. ఇకతాజాగామరోసారి అజయ్ భూపతి దర్శకత్వంలో సంచలన సినిమా చేస్తోంది.

అజయ్ భూపతి(Ajay Bhupathi) సినిమాతో సంచలనంగా మారింద పాయల్ రాజ్ పుత్(Payal Rajputh). ఆతరువాత ఆమెకు ఆరేంజ్ లో సాలిడ్ హిట్ పడలేదు. మళ్ళీ మధ్యలో ఎన్నో సినిమాలు చేసినా.. ఫలితం లేదు.. ఇకతాజాగామరోసారి అజయ్ భూపతి దర్శకత్వంలో సంచలన సినిమా చేస్తోంది. ఈసినిమాతో మరోసారి ఆమె ఫేట్ మారుతుందేమో అన్న నమ్మకంతో ఉంది పాయిల్. వీరిద్దరి కాంబోలో తెరకెక్కిన సినిమా మంగళవారం(Mangalavaram). మూవీ ట్రైలర్ తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో పాల్గొన్న హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ ఆడియన్స్ కు సంచలన నిజాలు వెల్లడించింది.

ఈ వేడుకల్లో తన ఆరోగ్య సమస్యల గురించి ప్రేక్షకులకు తెలిపి షాక్ ఇచ్చింది పాయల్ రాజ్ పుత్. తనకు కిడ్నీ ఇన్ఫెక్షన్(Kidney Infection) ఉందని, డాక్టర్లు కచ్చితంగా ఆపరేషన్ కూడా చేయాలన్నారని చెప్పింది. అజయ్ ఈ సినిమా కోసం నన్ను అప్రోచ్ అయ్యే టైంకి నా ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో ఎవరికీ తెలీదు. అప్పుడు నేను కిడ్నీ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నాను. డాక్టర్స్ సర్జరీ(Surgery) చేయాల్సిందేనని కచ్చితంగా చెప్పేశారు. కాని అజయ్ చెప్పిన కథ నాకెంతో నచ్చేసింది. ఈ సినిమా తప్పకుండా చేయాలని నిర్ణయించుకున్నా.

అందుకే సినిమా పూర్తి చేశాకే సర్జరీకి వెళ్తానని చెప్పాను. ఈసినిమా ను చేయడం కోసమే సర్జరీని పోస్ట్ పోన్ చేశాను అని అన్నారు పాయల్ రాజ్ పుత్. నా కెరీర ఎటువెళ్తుందో తెలియక సతమతం అవుతున్న టైమ్ లో..మంగళవారం సినిమా వచ్చింది. ఇది నాజీవితంలో చాలా ముఖ్యమైన రోజు, ట్రైలర్ విడుదలైన కొన్ని క్షణాల్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆర్ఎక్స్ 100’తో(RX100) అజయ్ భూపతి నన్ను లాంచ్ చేశారు. అది నా కెరీర్‌ను మార్చేసింది. ఇప్పుడు మంగళవారం’లో అవకాశం ఇచ్చి మరోసారి నన్ను లాంచ్ చేస్తున్నారు. ఆయనకు థ్యాంక్స్ అని అన్నారు పాయల్.

Updated On 24 Oct 2023 2:23 AM GMT
Ehatv

Ehatv

Next Story