అటు పాలిటిక్స్.. ఇటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ.. జాగ్రత్త గా కెరీర్ ను ప్లాన్ చేస్తున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. రాజకీయంగా పర్యటనలు చేస్తూ.. ఆంధ్రాలో వారాహీ యాత్రను (Varahi Yatra) చేస్తూ.. వస్తునన ఆయన.. తాజాగా జ్వరం కారణంగా యాత్రకు బ్రేక్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ బ్రేక్ రెండు రోజులు కొనసాగనున్నట్టు సమాచారం. అయితే ఈలోపు ఖాళీగా ఉండకుండా సినిమా వర్క్ చేసుకుంటున్నాడు పవర్ స్టార్ 

పవర్ స్టార్ పవర్ కళ్యాణ్ (Pawan Kalyan) తన వర్క్ సిన్సియారిటీని మరోసారి చూపించారు. వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నా.. లెక్క చేయకుండా.. సినిమా వర్క్ ను కంప్లీట్ చేసుకున్నారు.

అటు పాలిటిక్స్.. ఇటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ.. జాగ్రత్త గా కెరీర్ ను ప్లాన్ చేస్తున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. రాజకీయంగా పర్యటనలు చేస్తూ.. ఆంధ్రాలో వారాహీ యాత్రను (Varahi Yatra) చేస్తూ.. వస్తునన ఆయన.. తాజాగా జ్వరం కారణంగా యాత్రకు బ్రేక్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ బ్రేక్ రెండు రోజులు కొనసాగనున్నట్టు సమాచారం. అయితే ఈలోపు ఖాళీగా ఉండకుండా సినిమా వర్క్ చేసుకుంటున్నాడు పవర్ స్టార్

వారాహి యాత్రలో జ్వరంతో బాధపడ్డ పవర్ స్టార్.. రెండు రోజులు పాటు విరామం తీసుకున్నాడు. ఈ విరామ సమంయలోనే ఆయన.. జ్వరంతో ఉన్నా కాని.. తన సినిమాకు డబ్బింగ్ చెప్పుకున్నాడు. అది కూడా సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకుంటున్న తన బ్రో (BRO) సినిమాకు డబ్బింగ్ కంప్లీట్ చేశాడు పవర్ స్టార్. ఈసినిమాకు ఆయన డబ్బింగ్ చెపుతున్న స్టిల్స్ అండ్ వీడియోస్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి సోషల్ మీడియాలో.

ఆ మధ్య తమిళంలో వచ్చిన 'వినోదయా సీతమ్' సినిమాకి ఇది రీమేక్. తమిళంలో ఆ సినిమా ఘనవిజయాన్ని సాధించింది. తక్కువ పాత్రలతో .. తక్కువ బడ్జెట్ లో భారీ లాభాలను తెచ్చిపెట్టిన సినిమా అది. అయితే తమిళంలో ఈ సినిమాను డైరెక్ట్ చేసినన సముద్రఖని తెలుగు వెర్షన్ కి కూడా దర్శకత్వం వహించాడు. తెలుగులో ఈ సినిమాకి బ్రో .. ది అవతార్ టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఇంకో విషేషం ఏంటీ అంటే మెగా మామా అల్లుడు పవర్ స్టార్ , సాయి ధరమ్ తేజ్ ఇద్దరు కలిసి ఈసినిమాలో నటిస్తున్నారు. సాయి తేజ్ పోర్షన్ మాత్రమే ఈ సినిమాలో ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. దాంతో అసలు ఈసినిమా హీరో సాయినే అనాలి మరి. ఇక ఈసినిమా వచ్చే నెల 28 న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది.

Updated On 28 Jun 2023 8:11 AM GMT
Ehatv

Ehatv

Next Story