కర్నాటకలో(Karnataka) సంచలనం రేపుతున్న రేణుకా స్వామి హత్య(Renuka swamy Murder) కేసులో నటి పవిత్ర గౌడను(Pavitra gowda) ప్రధాన నిందితురాలిగా పోలీసులు పేర్కొన్నారు. ఈ మేరకు బెంగళూరులో 24వ అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ ఎదుట రిమాండ్‌ రిపోర్ట్‌ను సమర్పించారు.

కర్నాటకలో(Karnataka) సంచలనం రేపుతున్న రేణుకా స్వామి హత్య(Renuka swamy Murder) కేసులో నటి పవిత్ర గౌడను(Pavitra gowda) ప్రధాన నిందితురాలిగా పోలీసులు పేర్కొన్నారు. ఈ మేరకు బెంగళూరులో 24వ అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ ఎదుట రిమాండ్‌ రిపోర్ట్‌ను సమర్పించారు. నటి పవిత్ర గౌడను ఆన్‌లైన్‌లో వేధించాడన్న కోపంతో రేణుకస్వామి అనే చిరుద్యోగిని నటుడు దర్శన్‌ తూగుదీప, అతని అనుచరులు హత్య చేసిన విషయం విదితమే! ఈ కేసులో కొన్ని కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. స్వామికి కరెంట్‌ షాక్‌ ఇచ్చి హింసించామని ఇప్పటికే అరెస్టయిన ఒక నిందితుడు నేరాన్ని అంగీకరించాడు. హత్యానంతరం అరెస్ట్, కేసు నుంచి తప్పించుకోవడానికి, మృతదేహాన్ని మాయం చేసి ఆధారాలను ధ్వంసం చేయడానికి దర్శన్‌ భారీగా ఖర్చుచేశారని, అందుకోసం స్నేహితుడు మోహన్‌ రాజ్‌ నుంచి 40 లక్షల రూపాయలు అప్పు తీసుకున్నారని పోలీసులు వెల్లడించారు. షాక్‌ ఇచ్చేందుకు వాడిన ఎలక్ట్రిక్‌ షాక్‌ టార్చ్‌ను, ఆ 40 లక్షల నగదులో 37 లక్షలను పోలీసులు ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. దర్శన్, మరో ముగ్గురిని పోలీస్‌ కస్టడీకి, పవిత్ర గౌడను జ్యుడీషియల్‌ కస్టడీకి పంపాలని కోర్టును పోలీసులు కోరారు. చిత్రదుర్గ ప్రాంతంలో రేణుకస్వామిని కిడ్నాప్‌ చేసి అక్కడ్నుంచి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న బెంగళూరుకు తీసుకొచ్చారు. అక్కడ ఓ షెడ్‌లో కట్టేసి కొట్టారు. ఆ సమయంలో పవిత్ర గౌడ అక్కడే ఉన్నారని పోలీసులు చెబుతున్నారు. ఆమె కూడా రేణుకస్వామిని తన చెప్పులతో కొట్టారన్నారు. అసభ్య సందేశాలు పంపిన స్వామికి బుద్ది చెప్పాలని అక్కడే ఉన్న దర్శన్‌ను పవిత్ర ఉసిగొల్పారని చెప్పారు. మరోవైపు రేణుకస్వామి పోస్ట్‌మార్టమ్‌లో కొత్త విషయాలు తెలిశాయి. సున్నిత అవయవాలపై దాడితో వృషణాలు చితికిపోయాయని, ఒక చెవి కనిపించలేదని నివేదిక పేర్కొంది. రేణుకస్వామి గతంలో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసి డిలీట్‌చేసిన మెసేజ్‌లను వెలికి తీసివ్వాలని దాని మాతృ సంస్థ మెటాను పోలీసులు కోరారు. ఈ కేసులో ఇప్పటి వరకు 17 మందిని అరెస్ట్‌ చేశారు. 139కి పైగా సాక్ష్యాలను సేకరించారు. దర్శన్‌ అడిగిన వెంటనే 40 లక్షలు ఇచ్చిన మోహన్‌రాజ్‌ కోసం పోలీసులు వెతుకుతున్నారు. ఇంకో వైపు పవిత్రా గౌడను పరప్పన అగ్రహార జైలుకు తరలించారు. రాత్రి ఆమె నిద్రపోలేదని, చాలాసార్లు లేచి పచార్లు చేశారని పోలీసులు అంటున్నారు.

Eha Tv

Eha Tv

Next Story