ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డు వేడుకలు అట్టహాసంగా మొదలు అయ్యాయి. లాస్ ఏంజిల్స్ లోని డాల్బీ థియేటర్ లో ఈ 95వ ఆస్కార్ వేడుక చోటు చేసుకుంది. ఈ వేడుకకు ప్రపంచం నలుమూలల నుంచి తారలు తరలివచ్చారు. ఇక RRR మూవీ నుంచి రాజమౌళి, ఎన్టీఆర్, చరణ్, సెంథిల్ కుమార్, కీరవాణి, చంద్రబోస్, రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ, ప్రేమ్ రక్షిత్ మాస్టర్లతో పాటు ఉపాసన, రాజమౌళి తనయుడు కార్తికేయ.. మరికొంతమంది ఈ ఈవెంట్ కి హాజరయ్యారు. ఈరోజు ఉదయం 5 గంటల 30 నిమిషాలకు మొదలైన ఈ ఈవెంట్ మన తెలుగు సాంగ్ ‘నాటు నాటు’తో ప్రారంభం అయ్యింది.

ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డు వేడుకలు అట్టహాసంగా మొదలు అయ్యాయి. లాస్ ఏంజిల్స్ లోని డాల్బీ థియేటర్ లో ఈ 95వ ఆస్కార్ వేడుక చోటు చేసుకుంది. ఈ వేడుకకు ప్రపంచం నలుమూలల నుంచి తారలు తరలివచ్చారు. ఇక RRR మూవీ నుంచి రాజమౌళి, ఎన్టీఆర్, చరణ్, సెంథిల్ కుమార్, కీరవాణి, చంద్రబోస్, రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ, ప్రేమ్ రక్షిత్ మాస్టర్లతో పాటు ఉపాసన, రాజమౌళి తనయుడు కార్తికేయ.. మరికొంతమంది ఈ ఈవెంట్ కి హాజరయ్యారు. ఈరోజు ఉదయం 5 గంటల 30 నిమిషాలకు మొదలైన ఈ ఈవెంట్ మన తెలుగు సాంగ్ ‘నాటు నాటు’తో ప్రారంభం అయ్యింది.

ఎం ఎం కీరవాణి స్వరపరిచిన ఈ సాంగ్ ప్రపంచం మొత్తాన్ని ఉర్రూతలూగించిన విషయం తెలిసిందే. ఇక ఈ పాటకు ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ వేసిన స్టెప్పులు అయితే ఇంటర్నేషనల్ వైడ్ అందర్నీ ఒక ఊపు ఊపేశాయి. ఇక బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఈ పాట ఆస్కార్ బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. కాగా నేడు ఆస్కార్ ఈవెంట్ ని మొదలు పెడుతూ హోస్ట్ గా వ్యవహరిస్తున్న జిమ్మీ కిమ్మెల్ ఆస్కార్ గురించి మాట్లాడిన తరువాత ప్రోగ్రామ్ మొదలయ్యే ముందు స్టేజి పై మరికొందరు డాన్సర్స్ నాటు నాటు స్టెప్పు వేశాడు. దీంతో నాటు నాటు తో ఆస్కార్ వేడుక మొదలైంది. కాగా ఇంతటి ప్రతిష్టాత్మకమైన అవార్డు వేడుక ఒక తెలుగు పాటతో మొదలు కావడంతో తెలుగు ఆడియన్స్.. తెలుగు వాళ్ళకి ఇంతటి గౌరవం కలిగించినందుకు రాజమౌళి మరియు మూవీ టీంకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.

దీంతో నాటు నాటు సాంగ్, రాజమౌళి హ్యాష్ ట్యాగ్స్ టాప్ ట్రెండింగ్ లో నిలిచాయి. భారతీయ సినీ చరిత్రలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది RRR మూవీ. రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాలోని నాటు నాటు సాంగ్ ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు గెలుచుకుంది. 95వ అకాడమీ అవార్డులలో తెలుగు సినిమాకు ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో అవార్డ్ దక్కింది. ప్రపంచ సినీ చరిత్రలో ఓ తెలుగు చిత్రం ఆస్కార్‌కి నామినేట్‌ కావడం ఇదే తొలిసారి. ఆ పురస్కారం అందుకోవడం కూడా మొదటిసారే. అచ్చమైన భారతీయ సినిమాకి దక్కిన తొలి ఆస్కార్‌‌గా చరిత్ర సృష్టించింది. నాటు నాటు స్వరకర్త కీరవాణి, గీత రచయిత చంద్రబోస్ ఈ ఆస్కార్ అవార్డు అందుకున్నారు.

పాన్ ఇండియా మూవీగా వచ్చిన RRR సినిమాలోని ఈ నాటు నాటు పాటకు కీర‌వాణి సంగీతం అందించారు. రాహుల్ సిప్లిగంజ్‌, కాల బైర‌వ పాడారు. చంద్ర‌బోస్ లిరిక్స్ రాశారు. ఈ సాంగ్ విడుదలైనప్పటి నుంచే ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అయింది. ఇప్పుడు ఆస్కార్ గెలుచుకొని సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. లాస్ ఏంజిల్స్ డోల్బీ థియేటర్ వేదికగా జరుగుతున్న ఆస్కార్ వేడుకకు ప్రపంచ సినీ ప్రముఖులు తరలి వచ్చారు. ఇందులో RRR టీమ్ స్పెషల్ అట్రాక్షన్ కాగా.. రామ్ చరణ్, ఎన్టీఆర్ బ్లాక్ సూట్ లో తెగ సందడి చేశారు. అయితే నాటు నాటు పాట ఆస్కార్‌ దక్కించుకోవడం పట్ల యావత్ ఇండియన్ ఆడియన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పలువురు సెలిబ్రిటీలు, RRR యూనిట్ మొత్తానికి కంగ్రాట్స్ చెబుతూ పెద్ద ఎత్తున ట్వీట్స్ చేస్తున్నారు.

నాటు నాటు పాటకు ఆస్కార్ దక్కడం పట్ల మెగాస్టార్ చిరంజీవి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. దేశం గర్వించేలా చేసిన రాజమౌళిని పొగుడుతూ RRR యూనిట్ మొత్తానికి కంగ్రాట్స్ చెప్పారు చిరంజీవి. "భారతీయ చిత్రానికి ఆస్కార్ రావడం అనేది ఓ కలలా ఉండేది. ఆ కల RRR సినిమాతో సాకారమయ్యింది. ఇండియాలోని కొన్ని కోట్ల హృదయాలు గర్వపడేలా చేస్తూ ఇంతటి గొప్ప ఖ్యాతీని తీసుకొచ్చిన ఘనత రాజమౌళికే దక్కుతుంది. ఇది దేశం గర్వించే మూమెంట్" అని పేర్కొంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.

ఈ ఆస్కార్ అవార్డ్ పై హీరో పవన్ కల్యాన్ అభినందనలు తెలిపారు.. భారతీయులందరూ గర్వపడేలా ఆస్కార్ పురస్కారాన్ని అందుకున్న ఆర్ఆర్ఆర్ చిత్ర సంగీత దర్శకులు కీరవాణి, గీత రచయిత చంద్రబోస్ కు అభినందనలు . ఈ వార్త విని ఎంతో సంతోషించాను . ఆస్కార్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్గా నిలిచిన నాటు నాటు ప్రపంచం వ్యాప్తంగా అందరిని డ్యాన్స్ చేయించేలా చేసింది. ప్రతిష్టాత్మక స్టేజీపై పాటను ఆలపించడం...అవార్డును అందుకోవడంతో భారతీయ సినిమా ఖ్యాతి మరోస్థాయికి చేరింది. ఇంతటి ఘనత సొంతం అయ్యేలా చేసిన డైరెక్టర్ రాజమౌళి, నటులు , రామచరణ్, ఎన్టీఆర్ , గాయకులు రాహుల్ సిప్లిగంజ్ , కాలభైరవ, కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ నిర్మాత డీవీవీ దానయ్య మూవీ టీమ్ అందరికి నా అభినందనలు అంటూ పవన్ కల్యాన్ ట్వీట్ చేశారు.

మరోవైపు హీరో రవితేజ ..చరిత్ర సష్టించాం భారతీయులందరికి ఎప్పటికి గుర్తుండిపోయే రోజు అంటూ రవితేజ ట్వీట్ చేశారు .

Updated On 13 March 2023 2:40 AM GMT
Ehatv

Ehatv

Next Story