వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్నాడు టాలీవుడ్ యంగ్ స్టార్.. హీరో నిఖిల్ సిద్థార్ద్. ఇక ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు యంగ్ స్టార్. నార్త్ లో కూడా భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ సాధించిన ఈ హీరో.. ప్రస్తుతం హిందీ మార్కెట్ పై కన్నేశాడు.

వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్నాడు టాలీవుడ్ యంగ్ స్టార్.. హీరో నిఖిల్ సిద్థార్ద్(Nikhil Siddharth ). ఇక ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు యంగ్ స్టార్. నార్త్ లో కూడా భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ సాధించిన ఈ హీరో.. ప్రస్తుతం హిందీ మార్కెట్ పై కన్నేశాడు.

టాలీవుడ్(Tollywood) నుంచి పాన్ఇండియా(Pan India) స్థాయిలో ఇమేజ్ ను సాధించాడు యంగ్ హీరో నిఖిల్. వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్నాడు. కార్తికేయ-2 సినిమాతో గతేడాది బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన నిఖిల్.. ఈసినిమాను ఐదు భాషల్లో రిలీజ్ చేసి అద్భుతమైన విజయం సాధించాడు. అంతే కాదు నార్త్ మార్కెట్ లో కూడా ఈసినిమాతో పట్టు సాధించాడు. బాలీవుడ్ లో ఫ్యాన్స్ ను గెలుచుకున్నాడు. కేవలం 15 కోట్ల బడ్జెట్ తో కార్తికేయా2 తెరకెక్కింది. కాని ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర దాదాపుగా ఈ సినిమా 121 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. ఈ సినిమాతో నిఖిల్ కి బాలీవుడ్ నుంచి కూడా మంచి గుర్తింపు వచ్చింది.

కార్తికేయా2 నుంచి నిఖిల్ పై బాలీవుడ్ దృష్టి పెట్టింది. అక్కడి ఆడియన్స్ నిఖిల్ సినిమాలు చూడటం మొదలుపెట్టారు. అంతే కాదు ఈసినిమాతో బాలీవుడ్ లో ఓ అవార్డ్ కూడా పొదాడే నిఖిల్. నార్త్ లో అవార్డ్ సాధించిన మరో తెలుగు హీరోగా ఘనత సాధించాడు నిఖిల్. బాలీవుడ్ నుంచి కార్తికేయ సినిమాకు నిఖిల్ అవార్డ్ అందుకున్నాడు. ఈ విషయాన్ని బాలీవుడ్ మీడియా కూడా పెద్ద ఎత్తున ుప్రచారం అందించింది.

తాజాగా కార్తికేయా2 సినిమాకు గాను బాలీవుడ్ లో ఇచ్చే ప్రముఖ ఐకానిక్ గోల్డ్ అవార్డ్స్ (Iconic Gold Awards )ను అందుకున్నాడు నిఖిల్. ముంబై(Mumbai)లో గ్రాండ్ గా జరిగిన ఈ వేడుకల్లో.. 2022 గాను కార్తికేయ2(Karthikeya 2) సినిమాకి పాపులర్ ఛాయస్ కేటగిరీలో బెస్ట్ యాక్టర్ గా నిఖిల్ కి అవార్డుని సోంత చేసుకున్నారు. ఈ విషయాన్ని ప్రచారం చేస్తూ.. బాలీవుడ్ మీడియా పెద్ద ఎత్తున కథనాలు ప్రసారం చేసింది. అంతే కాదు నిఖిల్ ను పాన్ ఇండియా స్టార్ అంటూ.. ఆకాశానికి ఎత్తేసింది. ఈ అనూయ్య విజయంతో.. సడెన్ గా వచ్చిన ఇమేజ్ తో నిఖిల్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు.

2022 లో ఏడాది రిలీజ్ అయిన కార్తికేయ-2. 2014లో వచ్చిన కార్తికేయ సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కిందీ . సౌత్ లో చిన్న హీరోగా ఉన్న నిఖిల్ ను బాలీవుడ్ జనాలు ఆదరించడం. అక్కడ అవార్డ్ లు కూడా అందుకోవడంతో.. టాలీవుడ్ కు దక్కిన గౌరవంగా ఫీల్ అవుతున్నారు. బాలీవుడ్ లో మొదటి సినిమాతోనే స్టార్ గా ఎదిగిన నిఖిల్ ను టాలీవుడ్ ఆడియన్స్ అభినందిస్తున్నారు.. ఈ రెండు సినిమాలను యంగ్ డైరెక్టర్ చందు ముండేటినే దర్శకత్వం వహించాడు. ఇక కార్తికేయా2 ను అభిషేక్ అగర్వాల్ నిర్మించగా. నిర్మాణంలో యాక్షన్ అడ్వెంచర్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా ఎటువంటి అంచనాలు లేకుండా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అయ్యి కాసుల వర్షం కురిపించింది.

ఇక వరుస హిట్ల జోష్ లో నిఖిల్ ప్రస్తుతం స్పై అనే యాక్షన్ థ్రిల్లర్ మూవీలో నటిస్తున్నాడు. ఈ సినిమా కూడా పాన్ ఇండియాను దృష్టిలో పెట్టుకుని తెరకెక్కిస్తున్నారు. క్షణం, గూఢచారి, ఎవరు, హిట్-1,2 సినిమాలకు ఎడిటర్ గా, అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన గర్రి బిహెచ్ ఈ సినిమా కు డైరెక్టగా వ్యవహరిస్తున్నాడు. ఈ మూవీలో నిఖిల్ కి జోడిగా తమిళ హీరోయిన్ ఐశ్వర్య మీనన్ నటిస్తుంది.

Updated On 21 March 2023 7:09 AM GMT
Ehatv

Ehatv

Next Story