జనతా గ్యారేజ్ తర్వాత యంగ్ టైగర్ NTRతో కొరటాల శివ్ సెకండ్ మూవీ చేయబోతున్నారు. తన డైరెక్షన్ లో NTR30 తో బిగ్గెస్ట్ మాస్ ప్రాజెక్ట్ ను చేయబోతున్నాడు కొరటాల. ఇప్పటికే రిలీజైన మోషన్ పోస్టర్ గ్లింప్స్ అభిమానులందరినీ ఆకట్టుకుంది. ఈ పోస్టర్ రిలీజ్ తో అభిమానుల్లో ఈ సినిమాపై భారీ హైప్ ని క్రియేట్ చేసింది. కొత్త అప్ డేట్ కోసం వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కి చిత్ర యూనిట్ తాజాగా అప్ డేట్ ఇచ్చేసింది. […]

జనతా గ్యారేజ్ తర్వాత యంగ్ టైగర్ NTRతో కొరటాల శివ్ సెకండ్ మూవీ చేయబోతున్నారు. తన డైరెక్షన్ లో NTR30 తో బిగ్గెస్ట్ మాస్ ప్రాజెక్ట్ ను చేయబోతున్నాడు కొరటాల. ఇప్పటికే రిలీజైన మోషన్ పోస్టర్ గ్లింప్స్ అభిమానులందరినీ ఆకట్టుకుంది. ఈ పోస్టర్ రిలీజ్ తో అభిమానుల్లో ఈ సినిమాపై భారీ హైప్ ని క్రియేట్ చేసింది. కొత్త అప్ డేట్ కోసం వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కి చిత్ర యూనిట్ తాజాగా అప్ డేట్ ఇచ్చేసింది.

ప్యాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమా ఉంటుందని ఫ్యాన్స్ ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. NTR30 సినిమా షూటింగ్ ఫిబ్రవరి 30 నుంచి కానీ మార్చి మొదటి వారంలో స్టార్ట్ చేసే అవకాశం ఉన్నట్టు ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. అందుకోసం శంషాబాద్ లో చిన్న సెట్ కూడా వేసినట్టు సమాచారం. ఇక సెకండ్ షెడ్యూల్ గోవాలో ఉంటుందని, థర్డ్ షెడ్యూల్ మళ్లీ హైదరాబాద్ లో ఉంటుందని పోస్టర్ నెట్ లో వైరల్ అవుతోంది.

అయితే దీనిపై ఇంకా చిత్ర యూనిట్ అధికారికంగా ఎలాంటి స్టేట్ మెంట్ ఇవ్వలేదు. సినిమా షూటింగ్ ప్రారంభం కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు.

ఇక పక్కాగా అన్ని కుదిరితేనే సెట్స్ పైకి వెళ్లాలని భావిస్తోందట మూవీ టీమ్. మరోవైపు ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన నటిస్తున్నహీరోయిన్ విషయంలో కూడా ఇంకా ఎలాంటి క్లారిటి రాలేదు. ముందుగా అలియా భట్‌ను హీరోయిన్‌గా అనుకున్నారట. అయితే ఆమె పెళ్లి, ఇతర సినిమాలతో బిజీగా ఉండటంతో ఆమె ప్లేస్‌లో రష్మిక మందన్నను తీసుకునేందుకు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించబోతున్నాయి. మిక్కిలినేని సుధాకర్ ఈ చిత్రంతో నిర్మాతగా మారుతున్నారు.

Updated On 1 Feb 2023 5:49 AM GMT
Ehatv

Ehatv

Next Story