ఫస్ట్ టైమ్ తమ పిల్లలు కనిపించేలా ఫోటోలు పోస్ట్ చేసింది నయనతారు. ఇద్దరు పిల్లలను గుండెలకు హత్తుకుని..తమ మొదటి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపింది నయనతార. స్టార్ హీరోయిన్ నయనతార మరియు ఆమె కవలలు ఉయిర్(Uyir) మరియు ఉలాగ్‌(Ulagam) లు ఉన్న పిక్ చాలా బాగుంది.

మొదటి వివాహ వార్షికోత్సవాన్ని(Wedding Anniversary) సింప్లీ సూపర్ గా జరుపుకున్నారు నయనతార(Nayanthara) దంపతులు. తమ పిల్లలో ఆనందాన్ని శేర్ చేసుకున్నారు.

ఫస్ట్ టైమ్ తమ పిల్లలు కనిపించేలా ఫోటోలు పోస్ట్ చేసింది నయనతారు. ఇద్దరు పిల్లలను గుండెలకు హత్తుకుని..తమ మొదటి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపింది నయనతార. స్టార్ హీరోయిన్ నయనతార మరియు ఆమె కవలలు ఉయిర్(Uyir) మరియు ఉలాగ్‌(Ulagam) లు ఉన్న పిక్ చాలా బాగుంది. నయనతార తన పిల్లలను చూస్తూ ఆనందంతో ఉంది.

ఇక నయన్ భర్త, ప్రముఖ తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్(Vignesh Shivan).. ఈ రోజు వారి మొదటి వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ విషయంలో నెటిజన్లు రకరకాల కామెంట్లు చేుస్తున్నారు. కొంత మంది పాజిటీవ్ గా స్పందిస్తుంటే.. మరికొంత మంది మాత్రం కాస్త సెటైర్లు విసురుతున్నారు.

విఘ్నేష్ పోస్ట్ పెడుతూ.. నా జీవితానికి నిదర్శనం నువ్వే అంటూ చిన్న నోట్‌ని కూడా రాశాడు. నయన్‌ను ఉద్దేశించి, విఘ్నేష్ ఇలా రాయడం.. అభిమానులను ఎంతో సంతోషపెట్టింది. హ్యాపీ ఫస్ట్ ఇయర్ మ్యారేజ్ యానివర్సరీ. లవ్ యు తంగమే (బంగారం) అంటు అతను పోస్ట్ పెట్టాడు. అందరి ప్రేమ మరియు ఆశీర్వాదాలతో మా జీవితాన్ని ప్రారంభించాం. చాలా దూరం వెళ్లాలి అన్నారు. ఇక 2022లో ఈ రోజున మహాబలిపురంలో నయన్, విఘ్నేష్ పెళ్లి చేసుకున్నారు. గత ఏడాది అక్టోబర్‌లో ఈ జంట సరోగసి ద్వారా తమ కవలలు పుట్టినట్లు ప్రకటించారు.

Updated On 9 Jun 2023 11:39 PM GMT
Ehatv

Ehatv

Next Story