టాలీవుడ్ లో నరేష్‌- పవిత్ర లోకేష్ రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పెళ్లి కాకుండానే సహజీవనం చేస్తూ.. ఈ వయస్సులో కూడా హాట్ టాపిక్ గా మారారు ఇద్దరు. ఇక ప్రస్తుతం ఇద్దరు కలిసి చెట్టా పట్టాలేసకుని కోరిన చోటుకి తిరిగేస్తున్నారు.
టాలీవుడ్ లో వరుస వివాదాలతో హాట్ టాపిక్ గా మారారు నరేష్ , పవిత్ర లోకేష్. పెళ్ళి కాకుండానే తిరుగుతూ...

టాలీవుడ్ లో నరేష్‌- పవిత్ర లోకేష్ రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పెళ్లి కాకుండానే సహజీవనం చేస్తూ.. ఈ వయస్సులో కూడా హాట్ టాపిక్ గా మారారు ఇద్దరు. ఇక ప్రస్తుతం ఇద్దరు కలిసి చెట్టా పట్టాలేసకుని కోరిన చోటుకి తిరిగేస్తున్నారు.

టాలీవుడ్ లో వరుస వివాదాలతో హాట్ టాపిక్ గా మారారు నరేష్ , పవిత్ర లోకేష్. పెళ్ళి కాకుండానే తిరుగుతూ... అటు నెట్టింట్లో.. ఇటు ఇండస్ట్రీలో వైరల్ న్యూస్ అయ్యారు ఇద్దరు. అంతే కాదు ఇద్దరు కలిసి పార్టీలు, ఫంక్షన్లు, పెళ్ళిళ్లు... సినిమా ఫంక్షన్స్ కు కూడా కలిసి వెళ్తున్నారు. కెమెరాలకు ఫోజులిస్తూ.. తెగ సందడి చేసేస్తున్నారు నరేష్ , పవిత్ర.

ఇక నరేష్ , పవిత్ర జంట ఏ కార్యక్రమానికి వెళ్లినా చెట్టపట్టాలేసుకుని ఏంచక్క కొత్త జంట మాదిరి తిరుగుతూ.. మీడియా కంట పడుతున్నారు. తాజాగా నరేష్, పవిత్రల జంట ఆంధ్రప్రదేశ్‌లోని ఓ గ్రామంలో సందడిచేశారు. నరేష్ తల్లి దివంగత నటి,దర్శకురాలు విజయనిర్మల స్వగ్రామం అయిన.. ఏలూరు పాడులో సందడి చేశారు ఈ ఇద్దరు. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఈ గ్రామంలో ఆదివారం జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హజరయ్యారు.

గ్రామంలోని సెంటర్ లో ఉన్న అల్లూరి సీతారామరాజు, అంబేడ్కర్‌ విగ్రహాలకు పూల మాల వేశారుజంట.. నివాళి అర్పించారు.అక్కడి అమ్మవారి గుడిలో .. ప్రత్యేకంగా పూజలు కూడా చేశారు. సినిమా స్టార్స్ ఊళ్లోకి వచ్చారని.. అది కూడా నరేష్ పవిత్రలు వచ్చారని తెలిసి పెద్ద ఎత్తున జనం అక్కడికి చేరుకున్నారు. పక్క ఊర్ల నుంచి కూడా.. వారిద్దరిని చూడటానికి జనాలు తరలి వచ్చారు.
ఇక రోజంతా ఆ ఊరిలోనే సందడి చేశారు నరేష్.. పవిత్ర లోకేష్.

ఇక గత నాలుగేళ్లుగా సహజీవనంలో ఉన్న వారు త్వరలో పెళ్లి చేసుకుంటామని ప్రకటించా. అయితే నరేష్ కు తన మూడో భార్య రమ్యా రఘుపతితతో విడాకులు అవ్వలేదు. దాంతో ప్రస్తుతం సహజీవనంతోనే సరిపెట్టకుంటున్నారు. అయితే ఈ జంట పెళ్లి పీటలు ఎక్కుతుందో లేదో చూడాలి... అయితే ఈలోపు ఇద్దరు కలిసి టూర్లు వేస్తూ.. తెగ ఎంజాయ్ చేస్తున్నారు.. కలిసి సినిమాల్లో నటిస్తూ.. సందడి చేస్తున్నారు. తాజాగా వీరిద్దరూ కలిసి నటిస్తున్న మళ్లీ పెళ్లి అనే సినిమా రిలీజ్ కు రెడీ అవుతుంది. ఎంఎస్ రాజు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను విజయ కృష్ణ మూవీస్ బ్యానర్‌లో నరేష్ నిర్మిస్తున్నారు.

రీసెంట్ గా మేకర్స్‌ మళ్ళీ పెళ్లి నుంచి సినిమా ఫస్ట్ లుక్, గ్లింప్స్ వీడియోను రిలీజ్ చేశారు. ఇక ఇద్దరు పెళ్లి బట్టల్లో.. నిజంగాపెళ్ళి చేసుకున్నట్టు కనిపించారు. దాంతో ఒక్క సారిగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆతరువాత ఇది సినిమా ప్రమోషన్ అని ప్రకటించారు. ఇక సమ్మర్ కానుకగా.. ఈసినిమా థియేటర్లలో సందడి చేయబోతోంది.

Updated On 3 April 2023 7:03 AM GMT
Ehatv

Ehatv

Next Story