2017లో వచ్చిన ‘మెంటల్ మదిలో’ సినిమాతో డైరెక్టర్ గా వివేక్ ఆత్రేయ తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. ఇక ఆ తర్వాత ‘బ్రోచేవారెవరురా’ సినిమాను డిఫికల్ట్ స్క్రీన్ ప్లేతో ఆడియన్స్ మైండ్ బెండ్ చేశారు వివేక్ ఆత్రేయ. ఇక దాని తర్వాత వచ్చిన సినిమాయే ‘అంటే సుందరానికి’ టైటిల్ తో నాచురల్ స్టార్ నానితో ప్లాన్ చేశారు. అయితే ఆ సినిమా అనుకున్నంత విజయం సాధించలేకపోయింది. ఇక వివేక్ ఆత్రేయ తన రెగ్యులర్ స్టైల్ లా […]

2017లో వచ్చిన ‘మెంటల్ మదిలో’ సినిమాతో డైరెక్టర్ గా వివేక్ ఆత్రేయ తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. ఇక ఆ తర్వాత ‘బ్రోచేవారెవరురా’ సినిమాను డిఫికల్ట్ స్క్రీన్ ప్లేతో ఆడియన్స్ మైండ్ బెండ్ చేశారు వివేక్ ఆత్రేయ. ఇక దాని తర్వాత వచ్చిన సినిమాయే ‘అంటే సుందరానికి’ టైటిల్ తో నాచురల్ స్టార్ నానితో ప్లాన్ చేశారు. అయితే ఆ సినిమా అనుకున్నంత విజయం సాధించలేకపోయింది.

ఇక వివేక్ ఆత్రేయ తన రెగ్యులర్ స్టైల్ లా కాకుండా కొత్త జాన్రాతో కథ రెడీ చేసుకుని మళ్లీ నానికి నారేషన్ ఇచ్చాడు. అయితే ఆ కథ హీరోకి నచ్చినట్టు వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు వివేక్ ఆత్రేయ నానితోనే సినిమా చేస్తున్నాడంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. ఈ మూవీకి RRR వంటి భారీ సినిమాలను నిర్మించిన డివివి దానయ్య.. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్ మాంచి స్ట్రాంగ్ గా ఉంటుందని సమాచారం.

ఎప్పటిలా డైరెక్టర్ వివేక్ ఫన్ అండ్ ఎమోషన్ తో కూడిన సినిమా చేయకుండా ఇప్పుడు కొత్తగా ప్లాన్ చేస్తున్నాడట. అయితే నాని కూడా చేసిన జాన్రాలో చేయకుండా కొత్తగా ఉండేలా ప్రయత్నిస్తూనే ఉన్నారు. రీసెంట్ టైమ్స్ లో నాని మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ చేయలేదు. ‘దసరా’ మూవీ మాస్ చిత్రం కానీ రఫ్ అండ్ రగ్డ్ జాన్రా. అందువల్ల నాని మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ చేసేందుకు ఒప్పుకున్నాడట.

వివేక్ ఆత్రేయ చేయబోయే ఈ మాస్ అండ్ యాక్షన్ మూవీ ఓ రేంజ్ లో ఉండబోతుందట. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. ‘దసరా’ మూవీ విడుదల అవడం, ఆ తర్వాత వీలైనంత త్వరగా సీవీఎం నిర్మాణంలో సినిమా జరగాల్సి ఉంది. ఆ తర్వాత ఈ ఇయర్ లోనే వివేక్ ఆత్రేయ చిత్రం సెట్స్ మీదకు వెళ్తుంది. ఇక ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న నాని ‘దసరా’ మూవీకి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఈ నెల 30న విడుదల కానుంది.

Updated On 3 March 2023 4:54 AM GMT
Ehatv

Ehatv

Next Story