సినిమా ప్రారంభమైన క్షణం నుంచి ఎవ్వడికీ నోట మాట లేదు. ఒక్కొక్క షాట్‌ పాస్‌ అవుతుంటే ఆడియన్స్‌ తమమీద తాము గ్రిప్‌ కోల్పోయి పూర్తిగా సినిమాలో కూరుకుపోయారు. పిన్‌డ్రాప్‌ సైలెన్స్ హాలంతా. తెరమీద శబ్దం తప్పితే కిక్కురుమనకుండా చూడ్డం మొదలు పెట్టారు జనం. ఒంటి మీద స్పృహ వచ్చినప్పుడు పొలోమని చప్పట్లు, కేకలు, ఈలలు ధియేటర్‌ని అల్లలాడించాయి. దీనంతటికీ కారణం, కథ నడిచే మెస్మరైజింగ్‌ విధానం. కథనంలో టైట్‌ గ్రిప్‌. దర్శకుడు శ్రీకాంత్‌ ఆడియన్స్‌ని తేరుకోనివ్వలేదు. దెబ్బ మీద దెబ్బలా..సీన్‌ మీద సీన్‌ రన్‌ అవుతుంటే, ఆ కథ జరిగే గ్రామంలో జనంలో ధియేటర్‌లో జనం కూడా కలసిపోయి, తోవ తప్పిపోయారు.

Updated On 1 April 2023 5:13 AM GMT
Ehatv

Ehatv

Next Story