మహేశ్‌బాబు(Mahesh Babu)- నమ్రతా శిరోద్కర్‌(Namrata Shirodkar) చూడచక్కని జంట. వంశీ సినిమాలో హీరో హీరోయిన్లు నటించిన వీరిద్దరు నిజ జీవితంలోనూ వివాహబంధంతో ఒక్కటయ్యారు. మహేశ్‌బాబుకు ఇప్పుడు ఆమె సర్వస్వం. మహేశ్‌బాబు కాల్షీట్లు, వగైరాలు చూసుకునేది నమ్రతనే! ఈ దంపతులకు సితార, గౌతమ్‌ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇక సితార సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. భరతనాట్యం కూడా నేర్చుకుంటోంది.

మహేశ్‌బాబు(Mahesh Babu)- నమ్రతా శిరోద్కర్‌(Namrata Shirodkar) చూడచక్కని జంట. వంశీ సినిమాలో హీరో హీరోయిన్లు నటించిన వీరిద్దరు నిజ జీవితంలోనూ వివాహబంధంతో ఒక్కటయ్యారు. మహేశ్‌బాబుకు ఇప్పుడు ఆమె సర్వస్వం. మహేశ్‌బాబు కాల్షీట్లు, వగైరాలు చూసుకునేది నమ్రతనే! ఈ దంపతులకు సితార, గౌతమ్‌ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇక సితార సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. భరతనాట్యం కూడా నేర్చుకుంటోంది. చాలా రోజుల తర్వాత మహేశ్ బాబు ఫ్యామిలీ ఓ పార్టీకి హాజరైంది. ప్రముఖ వ్యాపారవేత్త జీవీకే రెడ్డి మనవరాలు శ్రియా భూపాల్ బేబీ షవర్ పార్టీకి మహేష్ బాబు భార్య, పిల్లలతో సహా హాజరయ్యారు. ఈ వేడుకలో పాల్గొన్న ఫోటోలను నమ్రత శిరోద్కర్ తన ఇన్‌స్టాలో షేర్‌ చేశారు. ఈ వేడుకలో నమ్రత శిరోద్కర్ సెంటర్‌ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. అందుకు కారణం ఆమె ధరించిన ప్రత్యేకమైన కుర్తానే! ప్రస్తుతం ఆ కుర్తా ధరపై నెట్టింట చర్చ మొదలయ్యింది. సుమారు నాలుగు లక్షల రూపాయలు ఉంటుందట. ప్రత్యేకమైన జార్జియో అర్మానీ కుర్తాలో నమ్రతా శిరోద్కర్ లుక్ అదిరిపోయిందంటూ నెటిజన్స్ కామెంట్‌ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా.. ప్రస్తుతం మహేశ్ బాబు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న గుంటూరు కారం చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం పూజా హేగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ ఈ నెల 12వ తేదీ నుంచి హైదరాబాద్‌లో ప్రారంభం కాబోతున్నది. నెల రోజుల పాటు ఈ షెడ్యూల్‌ ఉంటుంది. ఇందులో ప్రధాన తారాగణం పాల్గొంటారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న సినిమా విడుదల కానుంది.

Updated On 7 Jun 2023 4:30 AM GMT
Ehatv

Ehatv

Next Story