మైత్రి మూవీస్ నిర్మాత ఎర్నేని నవీన్(Yerneni Naveen)‏కు అస్వస్థతకు గురయ్యారు. ఆయనను ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందంటున్నారు వైద్యులు.

మైత్రి మూవీస్ నిర్మాత ఎర్నేని నవీన్(Yerneni Naveen)‏కు అస్వస్థతకు గురయ్యారు. ఆయనను ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందంటున్నారు వైద్యులు. అయితే గత మూడు రోజులుగా మైత్రీ మూవీస్ మేకర్స్ (mythri movie makers) కార్యాలయాలు, నివాసాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

గత రెండు రోజుల క్రితం ఇక జూబ్లీహిల్స్‏లోని మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) ప్రమోటర్స్‏తోపాటు యెర్నేని నవీన్(Naveen Yerneni), యలమంచిలి రవిశంకర్(Yalamanchili Ravi Shankar) ఇళ్లలోనూ అధికారులు సోదాలు నిర్వహించారు. హవాలా మార్గంలో నిధుల మళ్లింపు ద్వారా ప్రమోటర్లు మనీలాండరింగ్ పాల్పడినట్టు ఈడీకి సమాచారం అందినట్టు తెలుస్తోంది. అయితే ప్రమోటర్లకు విదేశాల్లోని ఎన్‏ఆర్ఐలతో వ్యాపార లింకులు ఉన్నాయంటున్నారు. అయితే గత డిసెంబర్‏లో మైత్రీ మూవీ మేకర్స్ కు చెందిన ఇళ్లు, ఆఫీసుల్లో ఇన్ కమ్‏ట్యాక్స్ అధికారులు సోదాలు నిర్వహించారు. జీఎస్టీ నిబంధనలను ఉల్లంఘించారని, ఐటీ రిటర్స్న్‏లో తప్పుడు వివరాలు సమర్పించారని ఆరోపించింది ఐటీ శాఖ.

Updated On 21 April 2023 4:33 AM GMT
Ehatv

Ehatv

Next Story