దర్శకుడు వెంకట్‌ప్రభు(Venkat prabhu) అన్ని రకాల సినిమాలు తీశాడు. చిన్న నటుల నుంచి స్టార్‌ హీరోల సినిమాలకు కూడా ఆయన దర్శకత్వం వహించాడు. క్రేజీ కాంబినేషన్లను సెట్‌ చేయడంలో ఘనాపాటి అతడు. ఆ మధ్యన అజిత్‌, అర్జున్‌లతో మంగాత్తా అనే సినిమా తీసి విజయాన్ని అందుకున్నాడు. ఇటీవల శింబు హీరోగా మానాడు అనే సినిమాను రూపొందించాడు. ఇది కూడా ఘన విజయం సాధించింది.

దర్శకుడు వెంకట్‌ప్రభు(Venkat prabhu) అన్ని రకాల సినిమాలు తీశాడు. చిన్న నటుల నుంచి స్టార్‌ హీరోల సినిమాలకు కూడా ఆయన దర్శకత్వం వహించాడు. క్రేజీ కాంబినేషన్లను సెట్‌ చేయడంలో ఘనాపాటి అతడు. ఆ మధ్యన అజిత్‌, అర్జున్‌లతో మంగాత్తా అనే సినిమా తీసి విజయాన్ని అందుకున్నాడు. ఇటీవల శింబు హీరోగా మానాడు అనే సినిమాను రూపొందించాడు. ఇది కూడా ఘన విజయం సాధించింది. ఇప్పుడు దళపతి విజయ్‌(Thalapathy Vijay) హీరోగా ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇది విజయ్‌ 68వ సినిమా కావడం విశేషం. ప్రస్తుతం లియో(Leo) చిత్రాన్ని పూర్తి చేసిన విజయ్‌ తర్వాత నటించేది వెంకట్‌ ప్రభు దర్శకత్వంలోనే. ఏజీఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌(AGS Entertainments) సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే నెలలో ప్రారంభం కాబోతున్నది. ఇందులో విజయ్‌ సరసన జ్యోతిక(Jyothika) నటించనున్నట్టు వార్తలు వచ్చాయి.

ఇది నిజమే అయితే మాత్రం సుదీర్ఘ విరామం తర్వాత వీరిద్దరు కలిసి నటిస్తున్న సినిమా అవుతుంది. ఇక తాజాగా అందిన సమాచారం ప్రకారం ఇందులో విలన్‌ పాత్రలో టీమిండియా(Team india) మాజీ క్రికెట్‌ కెప్టెన్ మహేందర్‌సింగ్‌ ధోనీ(Ex-Captain MS dhoni) నటించనున్నారట! ఇందులో నిజమెంతో తెలియదు కానీ సోషల్ మీడియాలో అయితే జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ మధ్యనే సినిమా నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టిన ధోని నటుడు హరీశ్‌ కల్యాణ్‌ హీరోగా ఎల్‌జీఎం(LGM) అనే సినిమా తీశాడు. ఈ చిత్రం ప్రమోషన్‌లలో ధోనీ భార్య సాక్షి ధోని కూడా పాల్గొన్నారు. ధోని హీరోగా యాక్షన్‌ ఓరియంటెండ్‌ సినిమాను త్వరలో చూస్తామని ఈ సందర్భంగా సాక్షి ధోని అన్నారు. అలాంటిది ఇప్పుడు విజయ్‌కు విలన్‌గా నటించనున్నారనే ప్రచారం ఆసక్తిని కలిగిస్తోంది. కాగా విజయ్‌ 68వ చిత్రానికి యువన్‌ శంకర్‌రాజా సంగీతాన్ని అందించనున్నారు.

Updated On 17 Aug 2023 12:50 AM GMT
Ehatv

Ehatv

Next Story