రవితేజ హీరోగా వచ్చిన మిస్టర్‌ బచ్చన్‌ (mr bachchan)తో తెలుగువారికి చేరువైన నటి భాగ్యశ్రీ బోర్సే (Bhagyashree Borse).

రవితేజ హీరోగా వచ్చిన మిస్టర్‌ బచ్చన్‌ (mr bachchan)తో తెలుగువారికి చేరువైన నటి భాగ్యశ్రీ బోర్సే (Bhagyashree Borse).మొదటి సినిమాతోనే యువకుల గుండెల్లో అలజడి రేపిన భార్యశ్రీ లేటెస్ట్‌గా బ్రహ్మాండమైన ఛాన్స్‌ కొట్టేశారు. దుల్కర్‌ సల్మాన్‌ (Dulquer Salmaan), రానా (Rana) మూవీలో హీరోయిన్‌గా నటించే అవకాశాన్ని దక్కించుకున్నారు. మమ్ముట్టి తనయుడు దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా కాంత అనే సినిమా తెరకెక్కుతోందన్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు నీలా ఫేమ్‌ సెల్వమణి సెల్వరాజ్‌ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. రానా కీలక పాత్రలో కనిపించనున్నారు. దుల్కర్‌ పుట్టినరోజు పురస్కరించుకుని ఇటీవల ఈ ప్రాజెక్ట్‌ అనౌన్స్‌ చేశారు. ఇప్పుడు కాంత సినిమా పూజా కార్యక్రమం జరిగింది. ఇందులో రానా, దుల్కర్‌ సల్మాన్‌తోపాటు భాగ్యశ్రీ బోర్సే పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వేఫరెర్ ఫిలిమ్స్‌, స్పిరిట్ మీడియా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. త్వరలోనే అ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కానుంది. కాగా , మహారాష్ట్రకు చెందిన భాగ్యశ్రీ స్నేహితుల ప్రోత్సాహంతో మోడలింగ్‌లోకి అడుగుపెట్టారు. పలు ప్రకటనలలో నటించారు. మిస్టర్‌ బచ్చన్‌ సినిమాతో నటిగా సినిమాల్లో తొలి అడుగు వేశారు. ఇందులో ఆమె జిక్కీ పాత్ర పోషించారు. ఆమె పలికించిన హావభావాలు, డ్యాన్స్‌కు ప్రజలు సమ్మోహితులయ్యారు.

Eha Tv

Eha Tv

Next Story