టాలీవుడ్‌ ఫేమస్‌ కొరియాగ్రాఫర్‌ జానీ మాస్టర్‌ వ్యవహారం సినీ పరిశ్రమలోనే కాదు, రాజకీయంగా కూడా పెను దుమారం రేపుతోంది.

టాలీవుడ్‌ ఫేమస్‌ కొరియాగ్రాఫర్‌ జానీ మాస్టర్‌ వ్యవహారం సినీ పరిశ్రమలోనే కాదు, రాజకీయంగా కూడా పెను దుమారం రేపుతోంది. తనపై లైంగికదాడి చేశాడని, వేధింపులకు గురి చేశాడని జానీ సహాయకురాలు రాయదుర్గం పోలీసు స్టేషన్‌(Raidurgam Police station)లో కేసు పెట్టిన విషయం తెలిసిందే. అతడిపై పోక్సో యాక్ట్‌ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. మైనర్‌గా ఉన్న సమయంలోనే ముంబాయి(Mumbai) హోటల్‌లో తనపై జానీ అత్యాచారం చేశారని బాధితురాలు ఫిర్యాదు చేసింది. జానీ మాస్టర్‌(jani Master)పై మహిళా కమిషన్‌లోనూ ఫిర్యాదు నమోదయ్యింది. జానీ మాస్టర్‌ జనసేన పార్టీ(Janasena Party)కి చెందిన వ్యక్తి కాబట్టి దీనికి రాజకీయ రంగు కూడా పులుముకుంది.ఈ వ్యవహారం వెలుగు చూసిన తర్వాత జనసేన కూడా ముందు జాగ్రత్తగా అతడిని పార్టీ నుంచి టెంపరరీగా సస్పెండ్‌ చేశారు. హిందు సంఘాలేమో లవ్‌ జీహాద్‌ అంటున్నాయి. మొత్తం మీద జానీ మాస్టర్‌పై ఉచ్చు బిగుసుకుంటోంది. ఇలాంటి సమయంలో జానీ మాస్టర్‌కు కొందరు సినీ పెద్దలు అండగా నిలుస్తున్నారట! వారు జానీ మాస్టార్‌పై పెట్టిన కేసును విత్‌డ్రా చేయించే ప్రయత్నంలో ఉన్నారట! ఇలాగని ఫిల్మ్‌నగర్‌లో చెప్పుకుంటున్నారు. ఇప్పటికే వారంతా కలిసి బాధితురాలని కలిశారట! ఆమెకు నయానో భయానో బెదిరించే పనిలో ఉన్నారట! జానీ మాస్టర్‌పై పెట్టిన కేసును ఉపసంహరించుకుంటే చేయాల్సిన సాయం అంతా చేస్తామని ఆమెకు మాట ఇస్తున్నారట! పెద్ద మొత్తంలో అమౌంట్‌ను ఆఫర్‌ చేశారని వినికిడి! ఇంత రచ్చ జరిగిన తర్వాత ఇప్పుడు కేసు విత్‌డ్రా చేసుకుంటే ఏమైనా ఉంటుందా? బాధితురాలు మాత్రం ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. చూద్దాం సినీ పెద్దల ప్రయత్నాలు ఎంత వరకు ఫలిస్తాయో!

ehatv

ehatv

Next Story