టాలీవుడ్ హీరో మంచు విష్ణు(Manchu vishnu) డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతోంది కన్నప్ప(Kannappa) సినిమా. బాలీవుడ్ లో మహాభరతం మెగా సీరియల్ ను అద్భుతంగా తెరకెక్కించిన డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్(Mukesh Kumar singh) కన్నప్పను డ్రైవ్ చేస్తున్నాడు. ఇక మంచు విష్ణు కన్నప్పగా భారీ బడ్జెట్ తో ఈమూవీ రూపొందుతోంది. ఈసినిమాలో.. మధుబాల, ప్రభాస్(Prabhas), నయనతార(Nayantara), మోహన్ లాల్(Mohan lal), శివరాజ్ కుమార్, శరత్ కుమార్.. ఇలా స్టార్ క్యాస్ట్ నటిస్తున్నారు.

టాలీవుడ్ హీరో మంచు విష్ణు(Manchu vishnu) డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతోంది కన్నప్ప(Kannappa) సినిమా. బాలీవుడ్ లో మహాభరతం మెగా సీరియల్ ను అద్భుతంగా తెరకెక్కించిన డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్(Mukesh Kumar singh) కన్నప్పను డ్రైవ్ చేస్తున్నాడు. ఇక మంచు విష్ణు కన్నప్పగా భారీ బడ్జెట్ తో ఈమూవీ రూపొందుతోంది. ఈసినిమాలో.. మధుబాల, ప్రభాస్(Prabhas), నయనతార(Nayantara), మోహన్ లాల్(Mohan lal), శివరాజ్ కుమార్, శరత్ కుమార్.. ఇలా స్టార్ క్యాస్ట్ నటిస్తున్నారు. ఇక ఈ మూవీ షూటింగ్ ఫస్ట్ షెడ్యుల్ న్యూజిలాండ్‌ అడవుల్లో స్టార్ట్ చేశారు. నాన్ స్టాప్ గా.. 90 రోజులు న్యూజిలాండ్ అడవుల్లో షూట్ చేశారు. ఈ షూటింగ్ లో మంచు విష్ణు గాయపడ్డాడు కూడా. అయినా షూటింగ్ ను ఆపకుండా నిర్విరామంగా కొనసాగించారు. న్యూజిలాండ్(Newzealand) షెడ్యూల్ అయిపోయేవరకూ.. దగ్గరుండిచూసుకున్నారు మంచు మోహన్ బాబు. దాదాపు మూడు నెలలు పాటు చిత్రీకరణ చేసి అక్కడ షూటింగ్ ని పూర్తి చేసింది.

అయితే ఈమూవీని మెహన్ బాబు(Mohan Babu) భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. అంతే కాదు. ఈమూవీ న్యూజిలాండ్ షెడ్యూల్ అయిపోయిందన్న విషయాన్ని ఆడియన్స్ కి తెలియజేశారు. ఇక మెహన్ బాబు పోస్ట్ లో ఏం చెప్పారంటే..? "న్యూజిలాండ్ లో 600 మంది హాలీవుడ్, మరియు భారతదేశంలోని అతిరధ మహారధులైన నటీనటులతో, థాయిలాండ్ మరియు న్యూజిలాండ్ సాంకేతిక నిపుణులతో, విష్ణు మంచు కథానాయకుడిగా నిర్మిస్తున్న చిత్రం 'కన్నప్ప'. 90 రోజుల మొదటి షెడ్యూల్ న్యూజిలాండ్ లోని అద్భుతమైన లొకేషన్స్ లో ఆ పరమేశ్వరుడు, షిర్డీ సాయినాథుని ఆశీస్సులతో అనుకున్నది అనుకున్నట్టుగా దిగ్విజయంగా షూటింగ్ పూర్తి చేసుకుని భారతదేశానికి తిరిగి వస్తున్నాం." అని కాసుకొచ్చారు.

ఇక న్యూజిలాండ్‌ షెడ్యూల్ లో కూడా కొంత మంది సీనియర్ నటులు జాయిన్ అయినట్టు తెలుస్తోంది. ఇందులో తమిళ స్టార్ హీరో శరత్ కుమార్, మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్ కూడా ఇందులో ఉన్నారు. వారిద్దరికీ సంబంధించిన షూటింగ్ పూర్తి అయ్యినట్లు తెలుస్తుంది. ఇక మిగిలిన స్టార్ క్యాస్ట్ పై సన్నివేశాలను ఇండియా షెడ్యూల్ తెరకెక్కించనున్నారని తెలుస్తుంది. అయితే టాలీవుడ్ ఆడియన్స్ అంతా ప్రభాస్ ఈ మూవీ సెట్స్ లోకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తారా అని ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ శివుడిగా కనిపించబోతున్నారట. పార్వతీ దేవిగా నయనతార నటించబోతున్నారని తెలుస్తుంది.

Updated On 23 Dec 2023 8:06 AM GMT
Ehatv

Ehatv

Next Story