మెగాస్టార్‌ చిరంజీవి(Chiranjeevi) కెరీర్‌లో ఓ మైలురాయిలా నిల్చిపోయిన సినిమా ఖైదీ(Khaidhi). ఆ సినిమాతో చిరంజీవి స్టార్‌ హీరో అయ్యారు. ఆ సినిమా ప్రేక్షకుల స్మృతిపథంలో నిలిచిపోయింది. ఈ జన్మ పగ కోసం.. వచ్చే జన్మ నీకోసం అనే డైలాగ్‌తో ఈ సినిమా ఎండ్‌ కార్డ్‌ పడుతుంది. ఈ సినిమాకు సీక్వెల్‌ తీయడానికి ఈ డైలాగు పెట్టారేమో అనిపిస్తుంది.

మెగాస్టార్‌ చిరంజీవి(Chiranjeevi) కెరీర్‌లో ఓ మైలురాయిలా నిల్చిపోయిన సినిమా ఖైదీ(Khaidhi). ఆ సినిమాతో చిరంజీవి స్టార్‌ హీరో అయ్యారు. ఆ సినిమా ప్రేక్షకుల స్మృతిపథంలో నిలిచిపోయింది. ఈ జన్మ పగ కోసం.. వచ్చే జన్మ నీకోసం అనే డైలాగ్‌తో ఈ సినిమా ఎండ్‌ కార్డ్‌ పడుతుంది. ఈ సినిమాకు సీక్వెల్‌ తీయడానికి ఈ డైలాగు పెట్టారేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆ డైలాగ్‌ నుంచే ఓ కొత్త కథను రూపొందించవచ్చు. అంటే ఖైదీకి సీక్వెల్‌ను(Kaidhi Sequel) ఈజీగా తీయవచ్చు. ఈ ఐడియా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌కు వచ్చింది. మరి ఈ సినిమా ఎవరు చేస్తారంటే ఇంకెవరు చిరంజీవే! చిరంజీవి కంటే మరెవ్వరూ చేయలేదు. ఒకవేళ కథ బాగుండి, సరైన దర్శకుడు దొరికితే చిరంజీవి మాత్రం ఎందుకు కాదంటారు? ఈ ప్రాజెక్ట్‌ నిజమైతే బాగుండనిపిస్తుంది కదూ! ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఇది వర్కట్‌ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇటీవల ఇదే విషయంపై చిరంజీవి, త్రివిక్రమ్‌(trivikram) కలుసుకున్నారు. ఖైదీ సీక్వెల్‌ బాధ్యతను త్రివిక్రమ్‌కు అప్పజెప్పారట మెగాస్టార్‌ చిరంజీవి. ఫిలింనగర్‌లో, సోషల్‌ మీడియాలో ఈ వార్త బాగా వైరల్‌ అవుతోంది. 1983లో విడుదలైన ఖైదీ ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఈ సినిమాతోనే చిరంజీవి అగ్ర కథనాయకుడయ్యాడు. ఇప్పుడు ఆయన ఖైదీ సీక్వెల్‌ చేస్తే అది నిజంగా అభిమానులకు గొప్ప వార్తే. పైగా దర్శకుడు త్రివిక్రమ్‌ అంటే అంచనాలు భారీగా ఉంటాయి. ప్రస్తుతం త్రివిక్రమ్‌ సూపర్‌స్టార్‌ మహేశ్‌తో గుంటూరుకారం సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత అల్లు అర్జున్‌తో సినిమా చేయాల్సి ఉంది. ఈ రెండు సినిమాల తర్వాత మెగాస్టార్‌ ఖైదీ సీక్వెల్‌ ఉండొచ్చని టాక్‌. చిరంజీవి కూడా తన ప్రాజెక్టులతో ప్రస్తుతం బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

Updated On 2 Oct 2023 12:38 AM GMT
Ehatv

Ehatv

Next Story