మంచు లక్ష్మిపై(Manchu Lakshmi).. మంచు మనోజ్(Manchu Manoj) పెట్టిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. నిన్ను చూస్తుంటే.. గర్వంగా ఉంది అక్కా అంటూ..మనోజ్ చేసి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ మనోజ్ ఎందుకు అలా అన్నారు.

మంచు లక్ష్మిపై(Manchu Lakshmi).. మంచు మనోజ్(Manchu Manoj) పెట్టిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. నిన్ను చూస్తుంటే.. గర్వంగా ఉంది అక్కా అంటూ..మనోజ్ చేసి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ మనోజ్ ఎందుకు అలా అన్నారు.

మంచుఫ్యామిలీ(Manchu Family) అంటే నోరు జారటాలు.. ట్రోల్ అవ్వడడాలులాంటివి గుర్తుకు వస్తాయి. కాని.. ఈసారి మాత్రం కాస్త రివర్స్ అయ్యింది. మంచు లక్ష్మిగురించి మంచు మనోజ్ చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. మంచులో ఇంత మంచి కోణం ఉందా అని అందరూ ఆలోరచనలో పడేట్టుగా చేస్తోంది. మనువ్వు చేసే మంచి మనిషికి ఎంతో సంతోషం అంటూ.. తన అక్కను చూస్తుంటే గర్వంగా ఉంది అన్నారు మంచు మనోజ్.

నటిగా ఎంతో పేరు తెచ్చుకున్న మంచు లక్ష్మి.. నిర్మాతగా,, హోస్ట్ గా మల్టీ టాలెంట్ చూపించింది. ఇటు సినిమాలు..అటు పలు సేవ కార్యక్రమాలు కూడా చేస్తూ తన గొప్ప మనసుని చాటుతుంటుంది. ముఖ్యంగా.. టీచ్‌ ఫర్‌ ఛేంజ్‌ అనే ఒక ఎన్జీవోని స్థాపించి గత కొంతకాలంగా ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకుంటూ వస్తుంది.

పేద పిల్లలో టాలెంట్ ను బయటకు లాగేలా.. వారు కూడా ఉన్నత చదువులు చదవాలి అనే ఉద్దేశ్యంతో.. ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకుని..వాటిలో అత్యాధునిక వసతులు, స్మార్ట్ క్లాసులు, ఇంగ్లీష్ క్లాసులు ఏర్పాటు చేస్తూ.. కార్పొరేట్ స్థాయిలో గవర్నమెంట్ స్కూల్స్ లో విద్య అందించేలా ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలోనే ఇప్పటికే శ్రీకాకుళం, యాదాద్రి జిల్లాలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 500 కు పైగా ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకుంది.

ఇక ఈకార్యక్రమంలో బాగంగా.. రీసెంట్ గా.. జోగుళాంబ గద్వాల జిల్లాలో మరో 30 పాఠశాలలను కూడా దత్తతకు తీసుకుంది మంచు లక్ష్మి వాటిని కూడా స్మార్ట్ స్కూల్స్ గా మార్చి.. విదార్ధులకు మంచి భవిష్యత్తు అందిస్తామన్నారు మంచు లక్ష్మి. ఇక మంచు లక్ష్మి చేస్తున్న ఈ మంచి పనిని మెచ్చుకుంటూ.. అక్కా నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది అంటున్నాడు మంచు మనోజ్. ఈ విషయం గురించే ఆయన పోస్ట్ వేశాడు.

Updated On 14 July 2023 3:01 AM GMT
Ehatv

Ehatv

Next Story