నరేష్(Naresh), పవిత్రా లోకేశ్‌ల(Pavitra Lokesh) నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా 'మళ్లీ పెళ్లి'(Malli Peli) థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ చిత్రాన్ని తెలుగు, కన్నడ భాషల్లో మే 26న విడుదల చేయనున్నారు.

నరేష్(Naresh), పవిత్రా లోకేశ్‌ల(Pavitra Lokesh) నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా 'మళ్లీ పెళ్లి'(Malli Peli) థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ చిత్రాన్ని తెలుగు, కన్నడ భాషల్లో మే 26న విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేసాడు నరేష్. ‘మళ్లీ పెళ్లి’ ట్రైలర్‌ ఇటీవలే విడుదలై మంచి రెస్పాన్స్‌ను అందుకుంది. ఈ జంట ఇటీవల హైదరాబాద్, కర్ణాటకలో ప్రెస్ మీట్ నిర్వహించారు. త‌ద్వారా సినిమాను ప్రమోషన్స్‌లో నెక్ట్స్ లెవల్‌కి తీస‌కెళ్తున్నారు.

'మళ్లీ పెళ్లి' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ వారాంతం ఆదివారం జరగనుంది. ఈ విషయాన్ని మేకర్స్ ఈరోజు ప్రకటించారు. మే 21 సాయంత్రం 6 గంటలకు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్ ఈ కార్యక్రమానికి వేదిక కానుంది. ఈ సినిమాకు ఎంఎస్‌ రాజు దర్శకత్వం వహించారు. విజయ కృష్ణ మూవీస్ బ్యానర్‌పై నరేష్ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో శరత్‌బాబు, జయసుధ, అన్నపూర్ణ ముఖ్య పాత్రలు పోషించారు. సురేష్ బొబ్బిలి సంగీతం సమకూర్చారు.

Updated On 18 May 2023 5:59 AM GMT
Ehatv

Ehatv

Next Story