మహి వి రాఘవ్(Mahi V Raghav) దర్శకత్వం వహించిన యాత్రా(Yatra) చిత్రానికి సీక్వెల్ గా యాత్ర-2 రూపొందుతుంది. నిన్న యాత్ర‌-2(Yatra2) నుంచి మొదటి పోస్టర్‌ను విడుదల చేసింది చిత్ర‌యూనిట్‌. పోస్టర్‌లో ఉన్న‌ శక్తివంతమైన కోట్‌.. జగన్(Jagan) మద్దతుదారులను, అభిమానుల‌ను ఆక‌ట్టుకుంది. పోస్టర్‌పై నేనెవరో ఈ ప్రపంచానికి ఇంకా తెలియకపోవొచ్చు. కానీ ఒక్కటి గుర్తు పెట్టుకోండి..

మహి వి రాఘవ్(Mahi V Raghav) దర్శకత్వం వహించిన 'యాత్రా'(Yatra) చిత్రానికి సీక్వెల్ గా యాత్ర-2 రూపొందుతుంది. నిన్న యాత్ర‌-2(Yatra2) నుంచి మొదటి పోస్టర్‌ను విడుదల చేసింది చిత్ర‌యూనిట్‌. పోస్టర్‌లో ఉన్న‌ శక్తివంతమైన కోట్‌.. జగన్(Jagan) మద్దతుదారులను, అభిమానుల‌ను ఆక‌ట్టుకుంది. పోస్టర్‌పై "నేనెవరో ఈ ప్రపంచానికి ఇంకా తెలియకపోవొచ్చు. కానీ ఒక్కటి గుర్తు పెట్టుకోండి.. నేను వైఎస్ రాజశేఖరరెడ్డి(Y. S. Rajasekhara Reddy) కొడుకుని" అంటూ ఉన్న డైలాగ్ జ‌నాల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంది. దీంతో నెట్టింట వైర‌ల్ అవుతంది. వైఎస్ జగన్(YS Jagan) ని వ్యతిరేకిస్తున్నవారు పోస్టర్ ను.. దానిలో ఉన్న‌ సందేశాన్ని అనుకూలంగా భావించినప్పటికీ, మెజారిటీ వ‌ర్గం మాత్రం ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

రాజశేఖరరెడ్డి మ‌ర‌ణాంత‌రం నుండి 2019 జ‌గ‌న్ సీఎం అయ్యేవ‌ర‌కూ.. కాంగ్రెస్ అధిష్టానాన్ని ఎదురించ‌డం, సీబీఐ విచార‌ణ‌, జైలు జీవితం, ఓదార్పు యాత్ర, రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత ప్ర‌తిప‌క్షంలో ఇబ్బందులు, పాద‌యాత్ర వంటి అన్ని అంశాలు ఈ చిత్రంలో చూపించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. పిబ్ర‌వ‌రి 24న ఈ సినిమా విడుద‌ల కానుంది. త‌మిళ హీరో జీవా లీడ్ రోల్‌లో న‌టిస్తున్నాడు. యూవీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.

Updated On 25 March 2024 6:17 AM GMT
Ehatv

Ehatv

Next Story