మహేశ్ బాబు(Mahesh Babu)- త్రివిక్రమ్‌(Trivikram) కాంబినేషన్‌లో వస్తున్న మూడో సినిమా గుంటూరు కారం(Gunturu Karam). ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుపుకుంటున్నది. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన మొదటి సినిమా అతడు(Athadu). ఇది బ్రహ్మండమైన విజయాన్ని అందుకుంది. తర్వాత ఖలేజా(Khaleja) వచ్చింది. ఇది ఆశించినంతగా ఆడలేదు. ఎందుకు ఆడలేదో ఇప్పటికీ అర్థం కాని విషయమని ఫ్యాన్స్‌ అంటుంటారు.

మహేశ్ బాబు(Mahesh Babu)- త్రివిక్రమ్‌(Trivikram) కాంబినేషన్‌లో వస్తున్న మూడో సినిమా గుంటూరు కారం(Gunturu Karam). ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుపుకుంటున్నది. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన మొదటి సినిమా అతడు(Athadu). ఇది బ్రహ్మండమైన విజయాన్ని అందుకుంది. తర్వాత ఖలేజా(Khaleja) వచ్చింది. ఇది ఆశించినంతగా ఆడలేదు. ఎందుకు ఆడలేదో ఇప్పటికీ అర్థం కాని విషయమని ఫ్యాన్స్‌ అంటుంటారు. మళ్లీ గుంటూరు కారం విషయానికి వస్తే కొద్ది రోజుల కిందటే హైదరాబాద్‌లో కొత్త షెడ్యూల్‌ను మొదలు పెట్టారు. ప్రస్తుతం యాక్షన్‌ సన్నివేశాలను(Action scenes) చిత్రీకరిస్తున్నారు. భారీ సంఖ్యలో ఫైటర్స్‌ ఇందులో పాల్గొన్నారు. హై ఇంటెన్సిటీ యాక్షన్‌ ఎపిసోడ్‌ను తెరకెక్కిస్తున్నారని యూనిట్‌ వర్గాలు అంటున్నాయి. గుంటూరు కారం సినిమాకు ఈ ఎపిసోడ్‌ హైలైట్‌గా నిలుస్తుందని, మహేష్‌బాబు సరికొత్త యాక్షన్‌ మోడ్‌లో కనిపిస్తారని టాక్‌ వినిపిస్తోంది. అతడు, ఖలేజా చిత్రాల తర్వాత మహేష్‌బాబు-త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ సినిమాపై ఫ్యాన్స్‌ భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ చిత్రాన్ని హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌(Harika and Hasini Creations) సంస్థ నిర్మిస్తున్నది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రంలో శ్రీలీల కథానాయికగా నటిస్తున్నది. తమన్‌ సంగీతాన్నందిస్తున్నారు.

Updated On 15 July 2023 2:07 AM GMT
Ehatv

Ehatv

Next Story