ప్రిన్స్‌ మహేశ్‌బాబు(Mahesh Babu), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌(Trivikram) కాంబినేషన్‌లో రూపొందుతున్న గుంటూరు కారం(Gunturu karam) సినిమా అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. హీరోయిన్‌గా నటించాల్సిన పూజా హెగ్డే సినిమా నుంచి తప్పుకుంది. ఆమె తప్పుకున్నదో లేక చిత్ర బృందమే తప్పించిందో తెలియదు.

ప్రిన్స్‌ మహేశ్‌బాబు(Mahesh Babu), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌(Trivikram) కాంబినేషన్‌లో రూపొందుతున్న గుంటూరు కారం(Gunturu karam) సినిమా అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. హీరోయిన్‌గా నటించాల్సిన పూజా హెగ్డే సినిమా నుంచి తప్పుకుంది. ఆమె తప్పుకున్నదో లేక చిత్ర బృందమే తప్పించిందో తెలియదు. దాంతో సెకండ్‌ హీరోయిన్‌ అయిన శ్రీలీలకు(sreeleela) లీడ్‌ రోల్‌ దక్కింది. మరో హీరోయిన్‌గా మీనాక్షి చౌదరి(Meenakshi chowdhary) నటిస్తున్నారు. ఈ సినిమాకు తమన్‌(Thaman) సంగీతం అందిస్తున్నారు. ఈ భారీ సినిమాను నాగవంశీ నిర్మిస్తున్నారు. సినిమా షూటింగ్‌కు బ్రేక్‌ ఇచ్చి ఇటీవలే వెకేషన్​కు వెళ్లిన మహేశ్‌బాబు మళ్లీ సినిమాలపై దృష్టి పెట్టారు. తాజాగా మహేశ్‌బాబు జిమ్​లో వర్కౌట్స్(Workouts)​ చేస్తూ కనిపించారు. ఆ ఫొటోలను ఇన్​స్టాగ్రామ్‌లో(Instagram) షేర్​ చేశారు. కొత్త సినిమా కోసమే మహేశ్‌బాబు ఇదంతా చేస్తున్నారని ఆయన ఫ్యాన్స్‌ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట ట్రెండ్​ అవుతోంది. గురువారం నుంచి గుంటూరు కారం సినిమా కొత్త షెడ్యూల్ మొదలయ్యింది. ఆగష్టు 18 నుంచి మహేశ్​ బాబు కూడా సెట్స్​లోకి రానున్నట్లు సమాచారం. అతడు, ఖలేజ సినిమాల తర్వాత త్రివిక్రమ్- మహేశ్​బాబు చేస్తున్న మూడో సినిమా గుంటూరు కారం కావడంతో ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పటికే విడుదలైన ​ పోస్టర్లు ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. షూటింగ్‌ బాగా ఆలస్యం అవుతుందని ఫ్యాన్స్‌ నిరాశపడుతున్న సమయంలో మహేశ్‌ చేసిన ఈ పోస్ట్‌ వారిలో ఫుల్‌జోష్‌ తీసుకొచ్చింది. అనుకున్న విధంగానే ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయనున్నారు.

Updated On 17 Aug 2023 6:18 AM GMT
Ehatv

Ehatv

Next Story