మహేష్ బాబు(Mahesh babu) ఇన్ స్టాగ్రామ్(instagram) లో చేసిన ఓ పోస్ట్ అభిమానులను కంగారు పెట్టింది. ఏమైంది మా సూపర్ స్టార్ కు అంటూ అంతా కామెంట్లు పెడుతూ.. ఆరాలు తీసేలా చేసింది. ఇంతకీ ఆయన పెట్టిన పోస్ట్ ఏంటంటే..?

మహేష్ బాబు(Mahesh babu) ఇన్ స్టాగ్రామ్(instagram) లో చేసిన ఓ పోస్ట్ అభిమానులను కంగారు పెట్టింది. ఏమైంది మా సూపర్ స్టార్ కు అంటూ అంతా కామెంట్లు పెడుతూ.. ఆరాలు తీసేలా చేసింది. ఇంతకీ ఆయన పెట్టిన పోస్ట్ ఏంటంటే..?

త్రివిక్రమ్(trivikram) తో చేస్తున్న SSMB28 సినిమాకు కాస్త బ్రేక్ ఇచ్చి ఫ్యామిలీతో.. ఫారెన్ టూర్ ను ఎంజాయ్ చేస్తున్నాడు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు. గత వారం రోజులుగా మహేష్ బాబు జర్మనీలో పర్యటిస్తున్నాడు. భార్య నమ్రత,పిల్లలు సితార, గౌతమ్ తో కలిసి ఫ్యామిల టూర్ లో.. ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నాడు. జర్మనీలోని బాడెన్ బాడెన్ లో బ్రెన్నర్స్ పార్క్ హోటల్ లో మహేష్ ఫ్యామిలీ బస చేశారు. ఇక్కడే ఓ డాక్టర్ తో కలిసి ఉన్న ఫోటోను మహేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

మహేష్ బాబు సోషల్ మీడియాలో పోస్టులు ఆ మధ్య తగ్గించేశారు. చాలా ఇంపార్టెంట్ అయితేనే పెడుతుంటారు. అది కూడా ఇన్ స్టాలో చాలా తక్కువనేచెప్పాలి. ఏదైనా ఆయన భార్య నమ్రత చూసుకుంటుంది. అటువంటిది మహేష్.. ఒక్క సారిగా మహేష్..జర్మన్ డాక్టర్ హ్యారీ కోనిగ్ తో కలసి దిగిన ఫొటోని తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. దాని కింద థ్యాంక్యూ డాక్టర్ హ్యారీ కోనిగ్(Dr. Harry Koenig)... ఆరోగ్యం మెరుగైన చేతుల్లో......అని పోస్ట్ పెట్టాడు. దాంతో ఫ్యాన్స్ ఆలోచనలో పడ్డారు మా స్టార్ హీరోకి ఏమైంది అని ఆరాలుతీస్తున్నారు.

ఈ పోస్ట్ పెట్డడంతో.. మహేష్ బాబు ఫ్యాన్స్ లో కలవరం మొదలైంది. మహేష్ కి ఏమైన అనారోగ్యం ఏర్పడిందా..? దానికి జర్మన్ డాక్టర్ ట్రీట్మెంట్ ఇచ్చి ఉంటారా..? ఈ విషయం మహేష్ ఎందుకు దాచాడు అని ఫ్యాన్స్ ఆరాలు తీస్తున్నారు. అందుకే మహేష్ డాక్టర్ కు స్పెషల్ గా థ్యాంక్స్ చెప్పారా..? ఇలా రకరకాల వాదనలు సోషల్ మీడియాలో వినిపించాయి. ప్రశ్నలు అభిమానుల నుంచి రేజ్ అవుతున్నాయి. అసలు విషయం ఏంటీ అని తెలుసుకోవడానికి నెట్టింట్లో సెర్చ్ చేస్తున్నారు మహేష్ ఫ్యాన్స్.

ఇక డాక్టర్ హ్యారీ కోనిగ్ జర్మనీలో ప్రముఖ నేచురోపతీ డాక్టర్. ముందస్తు వ్యాధి నివారణ ఔషధాలపై ఆయన పని చేస్తుంటారు. బ్రెన్నర్స్ మెడికల్ కేర్ సెంటర్ కు హెడ్ గా వ్యవహరిస్తున్నారు. ఇక మహేష్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో SSMB28 లో నటిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా చేస్తున్న ఈసినిమా షూటింగ్ ప్రస్తుతం రన్నింగ్ లో ఉంది. ఈసినిమా తరువాత మహేష్ బాబు.. న్న రాజమౌళితో.. భారీ బడ్జెట్.. అడ్వెంచర్ మూవీ చేయడానికి ప్లాన్ చేస్తున్నార

Updated On 17 April 2023 12:40 AM GMT
Ehatv

Ehatv

Next Story