సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు(Mahesh babu), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌(Trivikram) కాంబినేషన్‌లో గుంటూరు కారం అనే సినిమా తయారవుతున్నదన్న సంగతి తెలిసిందే. బుధవారం మహేశ్‌బాబు పుట్టిన రోజు. ఈ సందర్భంగా గుంటూరుకారం నుంచి ఓ క్రేజీ పోస్టర్‌ రిలీజ్‌(Poster release) అయ్యింది. ఇందులో లుంగీ లుక్‌, నోట్లో బీడీతో మహేశ్‌బాబు భిన్నంగా కనిపిస్తున్నాడు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ ఫ్యాన్స్‌ మాత్రం ఓ విషయంలో బాగా అసంతృప్తితో ఉన్నారు.

సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు(Mahesh babu), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌(Trivikram) కాంబినేషన్‌లో గుంటూరు కారం అనే సినిమా తయారవుతున్నదన్న సంగతి తెలిసిందే. బుధవారం మహేశ్‌బాబు పుట్టిన రోజు. ఈ సందర్భంగా గుంటూరుకారం నుంచి ఓ క్రేజీ పోస్టర్‌ రిలీజ్‌(Poster release) అయ్యింది. ఇందులో లుంగీ లుక్‌, నోట్లో బీడీతో మహేశ్‌బాబు భిన్నంగా కనిపిస్తున్నాడు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ ఫ్యాన్స్‌ మాత్రం ఓ విషయంలో బాగా అసంతృప్తితో ఉన్నారు. అసలు మహేశ్‌బాబు, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌కు ఎంతో క్రేజ్‌ ఉంటుంది. వీరిద్దరు కలిసి ఇంతకు ముందు అతడు, ఖలేజా అనే సినిమాలు చేశారు. అతడు హిట్టయ్యింది. ఖలేజా బోల్తా కొట్టింది. కానీ టీవీ, యూట్యూబ్‌లలో ఈ రెండు సినిమాలు సూపర్‌హిట్‌. మిలియన్ల కొద్దీ ప్రేక్షకులు ఈ సినిమాలను చూశారు. చూస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే వీరి కాంబోలో హ్యాట్రిక్‌ మూవీ అనే సరికి ఫ్యాన్స్‌ చాలా ఎగ్జైట్‌ అయ్యారు. కానీ గుంటూరుకారం విషయంలో ఏం జరుగుతున్నదో ఎవరికీ తెలియడం లేదు.

సరైన అప్‌డేట్స్‌ రావడం లేదు. అంతా గందరగోళంగా ఉంది. ఈ సినిమాకు గుంటూరు కారం అనే టైటిల్‌ను ఖరారు చేస్తూ సూపర్‌స్టార్‌ కృష్ణ జయంతి రోజున అంటే మే 31న గ్లింప్స్‌ వీడియో విడుదల చేశారు. వచ్చే సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 13న విడుదల చేస్తున్నామని ప్రకటించారు మూవీ మేకర్స్‌. ఇప్పుడు మహేశ్‌బాబు పుట్టినరోజు సందర్భంగా కొత్త పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. ఇందులో విడుదల తేదీ మారింది. జనవరి 12న విడుదల చేయబోతున్నట్టు అందులో చెప్పారు. మరి ఈసారైనా చెప్పిన తేదీకి కట్టుబడి ఉంటారా? మళ్లీ మారుస్తారా ? అన్నది చూడాలి. సినిమా స్టార్ట్‌ అయ్యి రెండేళ్లయ్యింది. ఈపాటికి సినిమా పూర్తి కావాలి.. కానీ కాలేదు. మొదట ఇందులో పూజా హెగ్డే, శ్రీలలను హీరోయిన్లుగా తీసుకున్నారు. కారణం ఏమిటో తెలియదు కానీ పూజా హెగ్డే ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. దీంతో సెకండ్‌ హీరోయిన్‌గా ఉన్న శ్రీలీల(sreeleela) కాస్తా ప్రధాన హీరోయిన్‌ అయ్యింది. మరో హీరోయిన్‌గా మీనాక్షి చౌదరి(Meenakshi Chowdhary) కొత్తగా వచ్చి చేరింది. సినిమాటోగ్రాఫర్ పీఎస్‌ వినోద్‌ కూడా తప్పుకున్నారు. తమన్‌ను కూడా తప్పించారనే వదంతులు వచ్చాయి. కానీ ఇది రూమర్‌ మాత్రమేనని తేలింది. మహేశ్ పుట్టినరోజున ఫస్ట్ లిరికల్ సాంగ్ వస్తుందని ఫ్యాన్స్‌ అనుకున్నారు. కానీ పోస్టర్ మాత్రమే రిలీజ్ కావడంతో వారు డిసప్పాయింట్‌కు గురయ్యారు.

Updated On 9 Aug 2023 8:12 AM GMT
Ehatv

Ehatv

Next Story