హారిక అండ్ హాసిని వారు ఈ సినిమాను నిర్మిస్తున్నా ఈసినిమా కెరియర్ పరంగా మహేశ్ బాబుకి ఇది 28వ సినిమా. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాలో శ్రీలీల మరో హీరోయిన్ గా నటిస్తున్నట్టు తెలుస్తోంది. తమన్ సంగీతాన్ని సమకూర్చుతున్న ఈ సినిమాలో స్టార్ కాస్ట్ సందడి చేయబోతున్నారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి సినిమా రాక చాలా కాలం అవుతుంది. దాంతో మహేష్ ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాచేలా సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. కాని మహేష్ బాబు 28వ సినిమా అంతకంతకులేట్ అవుతూ వస్తోంది. ఈక్రమంలో ఎన్నో అడ్డంకులు దాటుకుని త్రివిక్రమ్ డైరక్షన్ లో SSMB28 మూవీ రీసెంట్ గా స్టార్ట్ అవ్వగా.. ఫస్ట్ షెడ్యూల్ ను కంప్లీట్ చేసుకున్నారు. సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ అవ్వాల్సి ఉండగా మహేష్ ఫ్యామిలీతో ఫారెన్ కు చెక్కేశాడు.

హారిక అండ్ హాసిని వారు ఈ సినిమాను నిర్మిస్తున్నా ఈసినిమా కెరియర్ పరంగా మహేశ్ బాబుకి ఇది 28వ సినిమా. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాలో శ్రీలీల మరో హీరోయిన్ గా నటిస్తున్నట్టు తెలుస్తోంది. తమన్ సంగీతాన్ని సమకూర్చుతున్న ఈ సినిమాలో స్టార్ కాస్ట్ సందడి చేయబోతున్నారు.

ఈ సినిమా షూటింగు ఈ మధ్యనే మొదలైంది. మహేశ్ బాబు తదితరులపై కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించారు. ఆ తరువాత బ్రేక్ ఇవ్వడంతో, మహేశ్ బాబు ఫ్యామిలీతో ఫారిన్ వెళ్లాడు. ఫారెన్ లో కొన్ని రోజులు ఫ్యామిలీతో సరదాగా గడిపిన ఆయన, ఈ రోజే( 17 ఏప్రిల్ ) హైదరాబాద్ కి తిరిగి వచ్చాడు.

ఇక త్రివిక్రమ్ మూవీ షూటింగ్ షెడ్యూల్ ను ఫిక్స్ చేసుకున్నట్ట తెలుస్తోంది. ఈ శుక్రవారం నుంచి ఈ సినిమా తాజా షెడ్యూల్ షూటింగు జరుగుతుందని సమాచారం. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఇక నాన్ స్టాప్ గా షూటింగ్ చేసి.. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమాను జనవరి 13 నరిలీజ్ చేయాలని పక్కాగా ప్లాన్ చేశారు టీమ్. దాని కోసం త్రివిక్రమ్ ప్రణాళిక చేసుకున్నారట.

ఇక సర్కారువారి పాట' తరువాత మహేశ్ చేస్తున్న సినిమా ఇదే కావడం విశేషం. ఈ సినిమా తరువాత రాజమౌళి చేతుల్లోకి వెళ్లిపోబోతున్నాడు మహేష్ బాబు. భారీ బడ్జెట్ తో.. అడ్వెంచర్ మూవీగా ఓ సినిమా వీరి కాంబినేషన్ లో తెరకెక్కబోతోంది. ఈసినిమాకు సబంధించిన ప్రీ ప్రొడక్షన్ కూడా స్టార్ట్ అయినట్టు సమాచారం. పాన్ వరల్డ్ స్థాయిలో ఈమూవీని తెరకెక్కించబోతున్నారు జక్కన్న.

Updated On 17 April 2023 7:45 AM GMT
Ehatv

Ehatv

Next Story