ప్రేక్షకాదరణ సంపాదించుకున్న రియాలిటీ షో బిగ్‌బాస్‌ ఏడో సీజన్‌(Bigg Boss Season 7) మొదలయ్యింది. ఇందులో పాల్గొంటున్న 14 మంది కంటెస్టెంట్లను ఆదివారం హౌస్‌లోకి పంపించిన నాగార్జున దానికి తాళం వేశారు. ఆ విధంగా ఆదివారం ఎపిసోడ్ ముగిసింది. ఇక సోమవారం నుంచి అసలు మజా మొదలయ్యింది. నామినేషన్స్‌ షురూ కావడంతో కాంటెస్టెంట్లు అలెర్టయ్యారు. అన్నట్టు హౌసులో మొదటి ప్రేమాయణం(Lovestory) కూడా మొదలయ్యింది.

ప్రేక్షకాదరణ సంపాదించుకున్న రియాలిటీ షో బిగ్‌బాస్‌ ఏడో సీజన్‌(Bigg Boss Season 7) మొదలయ్యింది. ఇందులో పాల్గొంటున్న 14 మంది కంటెస్టెంట్లను ఆదివారం హౌస్‌లోకి పంపించిన నాగార్జున దానికి తాళం వేశారు. ఆ విధంగా ఆదివారం ఎపిసోడ్ ముగిసింది. ఇక సోమవారం నుంచి అసలు మజా మొదలయ్యింది. నామినేషన్స్‌ షురూ కావడంతో కాంటెస్టెంట్లు అలెర్టయ్యారు. అన్నట్టు హౌసులో మొదటి ప్రేమాయణం(Lovestory) కూడా మొదలయ్యింది. టేస్టీ తేజ(Tasty teja) అప్పుడే నారదుడి అవతారం ఎత్తి ఇద్దరి మధ్య తంపులు పెట్ఆడు. వీటితో పాటు మొదటి రోజు ఇంకా చాలా చాలా జరిగింది.

సినిమా ప్రమోషన్‌లో భాగంగా హౌసులోకి వెళ్లిన హీరో నవీన్‌ పొలిశెట్టిని(Naveen Polishetty) సీక్రెట్‌ రూమ్‌లో పెట్టి లాక్‌ చేశాడు బిగ్‌బాస్‌. హౌసులోని అమ్మాయిలందరూ కలిసి నవీన్‌ను బయటకు తీసుకొచ్చారు. అందరూ తమను తాము పరిచయం చేసుకున్నారు. తర్వాత మిస్‌ శెట్టి-మిస్టర్‌ పొలిశెట్టి సినిమాలోని లేడి లక్‌ పాటను నవీన్‌ గుర్తు చేశాడు. హౌసులో అబ్బాయిలు, అమ్మాయిల్లో నచ్చిన వాళ్లకు బ్యాండ్‌ కట్టాలని టాస్క్‌ ఇచ్చాడు. దాంతో ప్రియాంక జైన్‌కు ఆట సందీప్‌, దామినికి గౌతమ్‌ కృష్ణ, శోభాశెట్టికి అమర్‌దీప్‌, రతికకి పల్లవి ప్రశాంత్‌, శుభశ్రీకి శివాజీ, కిరణ్‌ రాథోడ్‌కు ప్రిన్స్‌ యవర్‌, షకీలాకు టేస్టీ తేజ బ్యాండ్‌ కట్టారు. తర్వాత లేడి లక్‌ పాటకు అందరితో కలిసి డ్యాన్స్‌ చేసిన నవీన్‌ హౌస్‌ నుంచి బయటకు వచ్చాడు.

నాగార్జున ఇచ్చిన సంకెళ్ల టాస్కులో భాగంగా గౌతమ్‌ కృష్ణ తన చేతికి ఉన్న హ్యాండ్‌ కఫ్‌ను శుభశ్రీకి వేశాడు. కాసేపటి తర్వాత అందరితో మాట్లాడిన బిగ్‌బాస్‌ హౌసులో ఎన్నో కొత్త విషయాలు, ఆశ్చర్యపరిచేవి ఎన్నో సిద్ధంగా ఉన్నాయని బిగ్‌బాస్‌ చెప్పారు. హౌసులో ఉన్నంత మాత్రాన హౌస్‌మేట్స్‌ అయినట్టు కాదని క్లారిటీ ఇచ్చారు. రతికకు బ్యాండ్‌ కట్టిన పల్లవి ప్రశాంత్‌ ఆమెతో మాటలు కలిపాడు. ఈ క్రమంలో బిగ్‌బాసు హౌసులోకి ఎందుకు రావాలనుకున్నావని ప్రశాంత్‌ను రతిక అడిగింది. మొదటిసారి బిగ్‌బాస్‌లోకి రావాలని అనిపించినప్పుడు ఓ వీడియో పెట్టానని, అందరూ తిట్టడంతో డిలీట్‌ చేశానని చెప్పాడు.

అప్పుడే షోలోకి ఎలాగైనా ఎంటరవ్వాలని డిసైడయ్యాడన్నారు. ఇక నైట్‌ ఒంటి గంటలకు లైట్స్‌ ఆఫ్‌ చేయడంతో అందరూ నిద్రపోవడానికి రెడీ అయ్యారు. మంచిగా పడుకోవడానికి సిద్ధమవుతున్న సందీప్‌, శివాజీ, పల్లవి ప్రశాంత్‌ను టాస్క్‌ పేరు చెప్పి రతిక భయపెట్టింది. దీంతో వారు పడుకోలేదు. మిగిలిన వాళ్లందరికీ బెడ్స్‌ లేకపోవడంతో కిచెన్‌లో మాట్లాడుతూ కాలక్షేపం చేశారు. మరోవైపు శోభాశెట్టి ఏడ్వడం మొదలుపెట్టింది. వీక్ అవ్వకూడదు.. వీక్ అవ్వకూడదు బీ స్ట్రాంగ్' అని తనకు తానే ధైర్యం చెప్పుకుంటూ ఏడ్చేసింది. సోమవారం ఉదయం 10:15 గంటలకు కంటెస్టెంట్స్ అందరూ నిద్రలేచారు. భోళా శంకర్ సినిమాలోని జాం జాం జజ్జనక పాటకు స్టెప్పులేసి బిగ్ బాస్‌కి గుడ్ మార్నింగ్ చెప్పారు. ఆ తర్వాత శివాజీకి పెళ్లయిందా? లేదా? అనే చర్చ పెట్టారు. తనకు పెళ్లి కాలేదని, బ్యాచిలర్ అని శివాజీ చెప్పాడు. నాగార్జున ఇచ్చిన బ్రోకన్ హార్ట్ టాస్క్ పూర్తి చేసేందుకు రతిక తిప్పలు పడింది. అమరదీప్-ప్రియాంక మధ్య గొడవ పెట్టమని శోభాశెట్టికి చెప్పగా ఆమె నో చెప్పింది. గెలిస్తే పర్లేదు లేదంటే తను నామినేట్ అయిపోతాను కదా అని భయపడింది. ఈ టాస్క్ వల్ల నీకు అడ్వాంటేజ్ దక్కుతుంది కదా అని రతికతో శోభాశెట్టి అన్నది.

టాస్క్ పూర్తి చేయడానికి పల్లవి ప్రశాంత్‌ దగ్గరకు రతిక వెళ్లింది. నీకోసం ఏ రిస్క్ అయినా సరే చేస్తానంటూ రతికతో ప్రశాంత్‌ అన్నాడు. ఆమె అలా నవ్వుతూ ఉండిపోయింది. మరోవైపు టేస్టీ తేజ-షకీలా మధ్య ఆసక్తికరమైన చర్చ జరిగింది. అసలు వ్యాంప్ తరహా సినిమాలు ఎందుకు చేశారు? అని షకీలాని టేస్టీ తేజ అడగ్గా.. అలాంటి క్యారెక్టర్స్ వచ్చాయని, అవే ఒప్పుకున్నానని షకీలా సమాధానమిచ్చింది. టాస్క్ చేయమంటూ రతిక టేస్టీ తేజని కూడా బతిమాలాడింది. కానీ అతడు కనీసం పేర్లు కూడా చెప్పొద్దని ఆమెతో అన్నాడు. ఫైనల్‌గా ఒప్పుకున్నాడు. మరోవైపు బ్రోకన్ హార్ట్ ఫస్ట్ తీసుకుంది శోభాశెట్టి. దీంతో ఇది తీసుకున్నందుకు తను కచ్చితంగా నామినేషన్స్‌లో ఉంటానని భయపడిపోయింది.

Updated On 5 Sep 2023 11:49 PM GMT
Ehatv

Ehatv

Next Story