లావణ్య(Lavanya)-రాజ్‌తరుణ్‌(Raj tharun) మధ్య వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది.

లావణ్య(Lavanya)-రాజ్‌తరుణ్‌(Raj tharun) మధ్య వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. వీరిద్దరి వ్వవహారం ఇప్పటిలో తేలేలా లేదు. రాజ్‌తరుణ్ ప్రేమించి, పెళ్లి చేసుకొని మోసంచేశాడని ఆరోపిస్తూ ఇప్పటికే పోలీసులను లావణ్య ఆశ్రయించింది. ఈ కేసులో ఇరువురు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. వీటిపై రాజ్ తరుణ్ అవన్నీ ఆరోపణలే అని పోలీసుల దగ్గర, కోర్టులో చూసుకుంటాను అని చెప్పాడు. అయితే తాజాగా మరో ఆరోపణను తెరమీదికి తెచ్చింది లావణ్య. రాజేంద్రనగర్ నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని లావణ్య ఇంట్లో చోరీ(Theft) జరిగిందని, సుమారు 12 లక్షల విలువైన బంగారు(gold) ఆభరణాలు చోరీ జరిగినట్టుగా మీడియాకు తెలిపింది లావణ్య. ఆ ఆభరణాలతో పాటు తాళిబొట్టు(Nupital chain) కూడా పోయిందని, రాజ్‌తరుణ్‌, మాల్వి మల్హోత్రపై తనకు అనుమానాలున్నాయని ఫిర్యాదులో పేర్కొంది. జైలుకు వెళ్లిన సమయంలో ఇంటి తాళం రాజ్‌తరుణ్‌ వద్ద ఉందని, అప్పుడే ఈ ఆభరణాలు తీసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తోంది. ముంబై వెళ్లి రాజ్‌తరుణ్ దగ్గర నుంచి తాళం తెచ్చి చూడగా తన ఆభరణాలు కనిపించలేదని ఫిర్యాదు చేసింది. నార్సింగి పోలీస్‌స్టేషన్‌లో ఈ విషయంపై ఫిర్యాదు చేసింది.

Eha Tv

Eha Tv

Next Story