ఈ రోజుల్లో సినిమా ప్రజల్లోకి వెళ్లాలంటే పబ్లిసిటీతో పాటు ప్రమోషన్స్‌(Promotions) చాలా అవసరం.

ఈ రోజుల్లో సినిమా ప్రజల్లోకి వెళ్లాలంటే పబ్లిసిటీతో పాటు ప్రమోషన్స్‌(Promotions) చాలా అవసరం. ఒకప్పుడంటే థియేటర్లలోనే త్వరలో విడుదల అంటూ కొత్త సినిమాల ట్రయిలర్లు వేసేవారు. అది కూడా అన్ని సినిమాలు కాదు! ఇప్పుడు సోషల్‌ మీడియా విస్తృతం కావడంతో సినిమా విడుదలకు ముందే పోస్టర్లు, టీజర్లు, ట్రైలర్లు వస్తున్నాయి. ఇకపోతే ప్రీ రిలీజ్‌(Pre Release event) ఈవెంట్‌ను భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. ఈ వేడుకకు సినిమాల్లో నటించిన వారితో పాటు టెక్నిషియన్లు కూడా పాల్గొంటారు. పెద్ద పెద్ద స్టార్లందరూ ప్రమోషన్‌లలో పాల్గొంటారు కానీ లేడి సూపర్‌స్టార్‌ నయనతార ఎందుకో వీటికి దూరంగా ఉంటారు. తన నటించిన సినిమాల కార్యక్రమాలకు కూడా ఆమె దూరంగా ఉంటారు. సొంత సినిమాలను కూడా పట్టించుకోరు. సినిమాను ఒప్పుకుంటున్నప్పుడే ప్రమోషన్‌లకు హాజరుకానని చెప్పేస్తారు. అలాగైతేనే అగ్రిమెంట్ మీద సంతకం పెడతారు. కానీ ఇప్పుడు ఓ దర్శకుడి కోసం తన నియమాన్ని సడలించుకున్నారు నయనతార. దర్శకుడు విష్ణువర్ధన్‌(Vishnu vardhan) కోసం ఆమె ఓ ప్రమోషన్‌ ఈవెంట్‌లో పాల్గొన్నారు. పవన్‌ కల్యాణ్‌తో(Pawan kalyan) పంజా సినిమాను రూపొందిందించి విష్ణు వర్ధనేనన్న విషయం తెలిసిందే! లేటెస్ట్‌గా ఆయన నేసిప్పయ(Nesippaya) అనే సినిమా తీశారు. ఇందులో అదితి శంకర్‌(Adithi Shankar) ప్రధాన పాత్ర పోషించింది. ఈ సినిమా ప్రమోషన్‌ కోసం నయనతారను అడిగితే ఆమె టక్కున ఒప్పేసుకున్నారు. నయనతార ప్రమోషన్‌ కారణంగానే సినిమాకు బజ్‌ వచ్చింది. ఏ సినిమా ప్రమోషన్స్‌కు రాని నయనతార ఈ సినిమాకు ఎందుకు వచ్చారంటే తమిళంలో బిల్లా(Billa) సినిమాకు విష్ణువర్ధన్ దర్శకత్వం వహించాడు. ఆ సినిమాలో నటించిన నయనతారకు ఆ తర్వాత డిమాండ్‌ బాగా పెరిగింది. ఆమె కెరీరే పూర్తిగా మారిపోయింది. వరుసుగా సినిమా ఆఫర్లు వచ్చాయి. అలా అలా ఇప్పుడు లేడీ సూపర్‌స్టార్‌ వరకు ఎదిగారు. తన కెరీర్‌ మలుపు తిరగడానికి కారకుడైన విష్ణువర్ధన్‌పై ఉన్న కృతజ్ఞతతోనే నయనతార తన నిబంధనలను పక్కన పెట్టారు. విష్ణువర్ధన్ తన ఫ్యామిలీ మెంబర్‌ లాంటి వాడని, అందుకే ఈ కార్యక్రమానికి వచ్చానని నయనతార చెప్పారు.

Eha Tv

Eha Tv

Next Story