అందం ప్లస్‌ అభినయం ఉన్న నటీమణులలో కృతి సనన్‌ ఒకరు. ఇటీవల ప్రకటించిన 69వ జాతీయ చలన చిత్ర అవార్డులలో ఆమెకు ఉత్తమ నటి పురస్కారం లభించింది. మిమీ సినిమాలో ఆమె సరోగసి మదర్‌గా అద్భుతంగా నటించారు. గంగూబాయి కఠియావాడి సినిమాలో నటించిన అలియాభట్‌తో కలిసి కృతి సనన్‌ జాతీయ ఉత్తమ నటి అవార్డును పంచుకున్నారు కృతి సనన్‌.

అందం ప్లస్‌ అభినయం ఉన్న నటీమణులలో కృతి సనన్‌(Kriti Sanon) ఒకరు. ఇటీవల ప్రకటించిన 69వ జాతీయ చలన చిత్ర అవార్డులలో ఆమెకు ఉత్తమ నటి పురస్కారం లభించింది. మిమీ సినిమాలో ఆమె సరోగసి మదర్‌గా అద్భుతంగా నటించారు. గంగూబాయి కఠియావాడి సినిమాలో నటించిన అలియాభట్‌తో కలిసి కృతి సనన్‌ జాతీయ ఉత్తమ నటి అవార్డును పంచుకున్నారు కృతి సనన్‌. జాతీయ అవార్డుతో తన చిరకాల స్వప్నం నెరవేరిందని కృతి సనన్‌ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన తన వంటి వారు అవార్డు గెల్చుకోవడం ఔత్సాహికులకు స్ఫూర్తినిస్తుందని కృతి సనన్‌ తెలిపారు. అవార్డు వచ్చిందని తెలియగానే పట్టరాని సంతోషం కలిగిందని ఆమె అన్నారు. తమ కుటుంబసభ్యులందరితో కలిసి డాన్సులు చేస్తూ ఆ రోజంతా చాలా ఉత్సాహంగా గడిపానని కృతి అన్నారు. నేషనల్‌ అవార్డు గురించి ఎప్పటి నుంచో తాను కలలు కంటున్నానని, ఎప్పటికైనా జాతీయ పురస్కారం సాధించాలని 2020లోనే డైరీలో రాసుకున్నానని తెలిపారు. తన స్వప్నం ఇప్పుడు నిజమయ్యిందని, అవార్డు వచ్చినంత మాత్రాన తానేదో సాధించానని అనుకోవడం లేదని అన్నారు. సినీ ఇండస్ట్రీలో నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉందని అన్నారు. ప్రస్తుతం కృతి సనన్‌ పలు సినిమాలలో నటిస్తున్నారు. ఇదిలా ఉంటే ఉత్తమ నటుడిగా అవార్డు గెల్చుకున్న అల్లు అర్జున్‌, కృతి సనన్‌లు పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకున్నారు. కృతికి అల్లు అర్జున్‌ విషెస్‌ చెబుతూ ట్వీట్‌ చేశారు. దానికి స్పందించిన కృతి ' మీ నటనకు నేను అభిమానిని. పుష్పలో మీ యాక్టింగ్‌ మైండ్‌ బ్లోయింగ్‌. సుకుమార్‌ సార్‌ డైరెక్షన్‌లో వస్తున్న పుష్ప ది రూల్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను' అని తెలిపారు. ఈ ట్వీట్‌తో కృతి సనన్‌ తనకు బన్నీతో కలిసి ఓ సినిమా చేయాలని ఉందని చెప్పకనే చెప్పారని ఫ్యాన్స్‌ అనుకుంటున్నారు.

Updated On 28 Aug 2023 6:34 AM GMT
Ehatv

Ehatv

Next Story