ప్రముఖ బాలీవుడ్‌ హీరోయిన్‌ కృతి సనన్‌(Kriti Sanon) సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి దశాబ్దం గడిచింది. ఆదిపురుష్‌లో(Adipurush) సీతగా నటించిన కృతి సనన్‌ అంతకు ముందు మహేశ్‌బాబు(Mahesh babu) హీరోగా వచ్చిన నేనొక్కడినేలో(Nenokadine) కూడా హీరోయిన్‌గా నటించారు. నటిగా పరిశ్రమలో మంచి గుర్తింపును పొందిన కృతి సనన్‌ ఇప్పుడు నిర్మాణ రంగంలో కూడా అడుగుపెట్టారు.

ప్రముఖ బాలీవుడ్‌ హీరోయిన్‌ కృతి సనన్‌(Kriti Sanon) సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి దశాబ్దం గడిచింది. ఆదిపురుష్‌లో(Adipurush) సీతగా నటించిన కృతి సనన్‌ అంతకు ముందు మహేశ్‌బాబు(Mahesh babu) హీరోగా వచ్చిన నేనొక్కడినేలో(Nenokadine) కూడా హీరోయిన్‌గా నటించారు. నటిగా పరిశ్రమలో మంచి గుర్తింపును పొందిన కృతి సనన్‌ ఇప్పుడు నిర్మాణ రంగంలో కూడా అడుగుపెట్టారు. ఆమె ప్రధానపాత్రలో నటిస్తూ నిర్మిస్తోన్న చిత్రం దో పత్తి(Do Pathi). మిస్టరీ థ్రిల్లర్‌ కథలో రాసుకున్న ఈ సినిమాలో కాజోల్‌(Kajol) ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. దిల్‌వాలే సినిమా వచ్చిన ఎనిమిదేళ్ల తర్వాత కృతి సనన్‌- కాజోల్‌ కలిసి నటిస్తున్న సినిమా ఇదే కావడం విశేషం. తన సొంత నిర్మాణ సంస్థ అయిన బ్లూ బటర్‌ఫ్లై ఫిలిమ్స్‌(Blue Butterfly Films) బ్యానర్‌పై దో పత్తి చిత్రాన్ని నిర్మిస్తున్నారు కృతి. ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం అయినట్లు కృతి సనన్‌ ఇన్‌స్టాగ్రామ్‌(Instagram) వేదికగా తెలిపారు. ‘‘ఈ ప్రత్యేకమైన ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నందుకు ఎన్నో సీతాకోకచిలుకలు నాలో నాట్యం చేస్తున్నాయి. ఇది నాకు సవాలుతో కూడిన పాత్ర. ఈ సినిమా కథ నాకు చాలా నచ్చింది. బ్లూ బటర్‌ఫ్లై ఫిలిమ్స్‌కు ఇది మొదటి సినిమా’ అంటూ ఇన్‌స్టాలో తాను పోస్ట్‌ చేసిన ఫొటోకు కామెంట్లను జోడించారు కృతి సనన్‌.

Updated On 24 Aug 2023 12:37 AM GMT
Ehatv

Ehatv

Next Story