ఉప్పెన(Upena) సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కృతి షెట్టి(Kriti Shetty) మొదటి సినిమాతోనే పేరు తెచ్చుకున్నారు. యూత్‌లో మంచి ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నారు. మంగళూరుకు(Mangalore) చెందిన ఈ అందాలభామ ఆరంభం అదిరిపోయినప్పటికీ తర్వాత ఆమెకు ఆశించిన మేర విజయాలు దక్కలేదు. అందుకే హీరోయిన్ల రేసులో కాసింత వెనుకబడింది.

ఉప్పెన(Upena) సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కృతి షెట్టి(Kriti Shetty) మొదటి సినిమాతోనే పేరు తెచ్చుకున్నారు. యూత్‌లో మంచి ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నారు. మంగళూరుకు(Mangalore) చెందిన ఈ అందాలభామ ఆరంభం అదిరిపోయినప్పటికీ తర్వాత ఆమెకు ఆశించిన మేర విజయాలు దక్కలేదు. అందుకే హీరోయిన్ల రేసులో కాసింత వెనుకబడింది. ఈ మధ్యన కృతిషెట్టిపై వచ్చిన ఓ వదంతి సోషల్‌ మీడియాలో(social media) వైరల్‌ అయ్యింది.

ఓ అగ్ర హీరో కుమారుడు కృతిశెట్టిని వేధిస్తున్నాడని(stalking), అతని ప్రవర్తన పట్ల ఆమెకు మనశ్శాంతి కరువైపోయిందని సోషల్‌ మీడియాలో కథనాలు వచ్చాయి. ఇదంతా కృతి షెట్టినే స్వయంగా చెప్పుకున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే ఇవన్నీ తప్పుడు వార్తలని కృతి షెట్టి ట్విట్టర్‌ వేదికగా స్పష్టం చేశారు. ఇవి పూర్తిగా నిరాధారమైన వార్తలని తెలిపారు. కురచ మనస్తత్వం ఉన్న వ్యక్తులే ఇలాంటి వదంతులను ప్రచారం చేస్తారని మండిపడ్డారు. మొదట ఈ వార్తలను సరదాగా తీసుకొని వదిలేద్దామనుకున్నానని, తన వ్యక్తిగత ఇమేజ్‌కు భంగం కలిగించేలా వైరల్‌ కావడం బాధించిందని కృతిషెట్టి అన్నారు. ప్రస్తుతం ఈ అందాలభామ తమిళ, మలయాళ భాషల్లో సినిమాలు చేస్తున్నది.

Updated On 8 July 2023 4:24 AM GMT
Ehatv

Ehatv

Next Story