బాలీవుడ్ తో పాటు ఇటు టాలీవుడ్ లోనూ పలు సినిమాల్లో నటించి ఫ్యాన్స్ ను మెప్పించిన బ్యూటీ ముద్దుగుమ్మ కియారా అద్వానీ. హీరోయిన్ గా కియారా అద్వానీ వరుసగా సినిమాలతో బిజీ ఉన్న నేపథ్యంలో ఆమె వైవాహిక జీవితం వల్ల కెరీర్ కు ఆటంకం ఏర్పడే అవకాశం ఉందని అంతా అనుకున్నారు.

బాలీవుడ్ తో పాటు ఇటు టాలీవుడ్ లోనూ పలు సినిమాల్లో నటించి ఫ్యాన్స్ ను మెప్పించిన బ్యూటీ ముద్దుగుమ్మ కియారా అద్వానీ. హీరోయిన్ గా కియారా అద్వానీ వరుసగా సినిమాలతో బిజీ ఉన్న నేపథ్యంలో ఆమె వైవాహిక జీవితం వల్ల కెరీర్ కు ఆటంకం ఏర్పడే అవకాశం ఉందని అంతా అనుకున్నారు . కానీ పెళ్లి అనేది తన కెరీర్ కు ఏమాత్రం అడ్డు రాదని కియారా అద్వానీ మరోసారి ప్రూవ్ చేస్తూ ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేసింది.

రాజస్థాన్ లోని జైసల్మీర్ లోని ఒక హోటల్ లో సినీ ప్రముఖులు.. రాజకీయ ప్రముఖులు.. బంధు మిత్రుల సమక్షంలో వైభవంగా కియారా.. సిద్దార్థ్ మల్హోత్రా వివాహం జరిగింది. సోషల్ మీడియాలో వీరి పెళ్లి ఫొటోలు మరియు వీడియోలు ఇంకా కూడా వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా మరోసారి కియారా అద్వానీ తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచింది.

పెళ్లి తర్వాత సినీ కెరీర్ ను మరోవైపు వ్యక్తిగత జీవితం గురించి ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. పెళ్లి అయిన తర్వాత నేను కూడా ఫ్యామిలీ రెస్పాన్స్బులిటీస్ నిర్వహిస్తున్నాను. ఈ విషయంలో నాకు చాలా హ్యాప్పీగా ఉందన్నారు ఈ కొత్త పెళ్లికూతురు కియారా ..పెళ్లి చేసుకున్న తర్వాత నా ఇంటి బాధ్యత పూర్తిగా నేను చూసుకోవడం గొప్ప అనుభూతిని ఇస్తుందని చెప్పుకొచ్చింది ఈ అమ్మడు.

ఇక తన భర్త సిద్దార్థ్ మల్హోత్రా గురించి తెగ పొగిడేసింది . సిద్దార్థ్ గొప్ప లైఫ్ పార్టనర్ అని ...నన్ను జీవితంలో ప్రతి విషయంలో కూడా ఎంకరేజ్ చేస్తూ వస్తున్నాడు అని చెప్పుకొచ్చింది . అన్ని విషయాల్లో కూడా చాలా మొండిగా వ్యవహరిస్తూ ముందుకు వెళ్తూ ఉంటాడు. ప్రతి సారి కూడా ఏదైనా సాధించాలి అనే తపనతో కనిపిస్తూ ఉంటాడు. షేర్షా సినిమా లో మేము చేసిన పాత్రల మాదిరిగానే మరో సినిమా చేస్తాము. తప్పకుండా మా నుండి మంచి సినిమాలు ముందు ముందు వస్తాయని ఆమె హామీ ఇచ్చింది. ప్రస్తుతానికి వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నట్లుగా సిద్దార్థ్ మల్హోత్రా తో జీవితం కొత్తగా ఉందని కియారా గొప్పగా చెప్పుకొచ్చింది.

Updated On 9 March 2023 5:23 AM GMT
Ehatv

Ehatv

Next Story