మహానటి సినిమాతో తెలుగువారికి అత్యంత ఆత్మీయురాలిగా మారిన మలయాళ నటి కీర్తి సురేశ్‌(Keerthy Suresh) ఇప్పుడు చాలా బిజీ. వరుస సినిమాలతో ఆమె తీరిక లేకుండా ఉన్నారు. ఈమె సినిమా కబర్లతో పాటు పెళ్లి వార్తలు కూడా గత కొద్ది రోజులుగా హాట్‌టాపిక్‌గా మారాయి. సోషల్‌ మీడియాలో కీర్తి సురేశ్‌ పెళ్లి వార్తలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. తన చిన్ననాటి స్నేహితుడిని ఈమె తర్వలో పెళ్లి చేసుకోబోతున్నదన్న ప్రచారం కూడా జరిగింది.

మహానటి సినిమాతో తెలుగువారికి అత్యంత ఆత్మీయురాలిగా మారిన మలయాళ నటి కీర్తి సురేశ్‌(Keerthy Suresh) ఇప్పుడు చాలా బిజీ. వరుస సినిమాలతో ఆమె తీరిక లేకుండా ఉన్నారు. ఈమె సినిమా కబర్లతో పాటు పెళ్లి వార్తలు కూడా గత కొద్ది రోజులుగా హాట్‌టాపిక్‌గా మారాయి. సోషల్‌ మీడియాలో కీర్తి సురేశ్‌ పెళ్లి వార్తలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. తన చిన్ననాటి స్నేహితుడిని ఈమె తర్వలో పెళ్లి చేసుకోబోతున్నదన్న ప్రచారం కూడా జరిగింది. అయితే పెళ్లి విషయం గురించి కీర్తి సురేశ్‌తో పాటు ఆమె తండ్రి కూడా వివరణ ఇచ్చారు. పెళ్లి వార్తలలో ఏ మాత్రం నిజం లేదన్నారు. అయిప్పటికీ సోషల్‌ మీడియాలో కీర్తి సురేశ్‌ పెళ్లి గురించి కథనాలు వస్తూనే ఉన్నాయి. ఆమె నటించిన తాజా చిత్రం మామన్నన్‌ ఆడియా వేడుక ఇటీవల చెన్నైలో జరిగింది. ఈ వేడుకలో కూడా కీర్తి సురేశ్‌ను పెళ్లి గురించే విలేకరులు ప్రశ్నలు వేశారు. దీంతో కీర్తి సురేశ్‌ కాసింత అసహనానికి గురయ్యారు. తన పెళ్లి గురించి మరోసారి అడగవద్దని విలేకరులను కోరారు. పెళ్లి విషయంలో ఇప్పటికే తాను స్పష్టత నిచ్చాను. అయినా ప్రతీ సందర్భంలో ఇవే ప్రశ్నలడుగుతున్నారని ఆమె అన్నారు. ఒకవేళ పెళ్లంటూ కుదిరితే తానే స్వయంగా అందరికీ చెబుతానని తెలిపారు.

Updated On 5 Jun 2023 2:31 AM GMT
Ehatv

Ehatv

Next Story