జిగ్రా(Jigra) సినిమా వివాదం ముదురుతోంది.

జిగ్రా(Jigra) సినిమా వివాదం ముదురుతోంది. జిగ్రా సినిమాపై నటి, నిర్మాత, దర్శకురాలు దివ్య ఖోస్లా తీవ్రమైన విమర్శలు చేసిన విషయం తెలిసిందే. సినిమా విడుదలైన రోజే తాను చాలా ఖాళీ థియేటర్లు చూశానని చెబుతూ, రుజువుగా ఫోటో కూడా పోస్ట్ చేశారు. మూవీ మేకర్స్‌ కావాలనే జిగ్రా కలెక్షన్లను పెంచి చూపిస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై ప్రముఖ నిర్మాత కరణ్‌ జోహార్‌ మండిపడ్డారు. 'మూర్ఖులకు ఇచ్చే ఉత్తమ సమాధానం మౌనమే' అని కరణ్‌ జోహార్‌(Karan johar) ట్వీట్‌ చేశారు. పేరు ప్రస్తావించకపోయినా ఆ ట్వీట్‌ తన గురించేనని తెలుసుకోలేని అమాయకురాలేం కాదు దివ్య. ఆమె మరో ట్వీట్‌ చేసింది. తనలాంటి వ్యక్తిపైనే ఇంత వివక్ష చూపిస్తే, బయట అమ్మాయిలు ఇండస్ట్రీలోకి ఎలా వస్తారంటూ ఆగ్రహించారు. ఇప్పుడు గొడవ ఎఫెక్ట్‌ యానిమల్ పార్క్‌ సినిమాపై పడేట్టుగా ఉంది. ఎందుకంటే దివ్య ఖోస్లాకు యానిమల్‌ పార్క్‌ సినిమాకు సంబంధం ఉంది కాబట్టి. బ్లాక్‌బస్టర్‌ సినిమా యానమిల్‌ను ప్రొడ్యుస్‌ చేసింది భరత్‌ భూషణ్‌కుమార్‌. ఈయన ఎవరో కాదు దివ్య భర్త. యానిమాల్‌ పార్క్‌లో హీరోగా నటించబోతున్నది రణబీర్‌ కపూర్‌. ఈయన ఎవరంటే జిగ్రా సినిమాలో హీరోయిన్‌గా నటించిన అలియాభట్‌ భర్త! హీరో భార్యపై నిర్మాత భార్య ఆరోపణలు చేస్తున్నారన్నమాట! హీరో భార్య, నిర్మాత భార్య ఇలా తిట్టుకుంటుంటే సినిమా చేయడం సాధ్యమవుతుందా? అన్నదే ప్రశ్న! అయితే యానిమల్ పార్క్‌ సెట్స్‌ మీద వెళ్లడానికి ఇంకొంచెం టైమ్‌ ఉంది. ప్రస్తుతం దర్శకుడు సందీప్‌రెడ్డ వంగా ప్రభాస్‌తో స్పిరిట్‌ సినిమా తీయడానికి రెడీ అవుతున్నాడు. అంచేత యానిమల్ పార్క్‌ సినిమా ప్రారంభమయ్యేలోపు ఈ గొడవలన్నీ సర్దుకుంటాయని భావిస్తున్నారు.

Eha Tv

Eha Tv

Next Story