ప్రముఖ కన్నడ నటి, టెలివిజన్ వ్యాఖ్యాత, మాజీ రేడియో జాకీ అపర్ణా వస్తారే గురువారం రాత్రి మరణించినట్లు ఆమె సన్నిహిత వర్గాలు తెలిపాయి

ప్రముఖ కన్నడ నటి, టెలివిజన్ వ్యాఖ్యాత, మాజీ రేడియో జాకీ అపర్ణా వస్తారే గురువారం రాత్రి మరణించినట్లు ఆమె సన్నిహిత వర్గాలు తెలిపాయి. 57 ఏళ్ల అపర్ణ గత రెండేళ్లుగా ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో పోరాడుతున్నారని ఆమె భర్త నాగరాజ్ తెలిపారు. డీడీ చందనలో వ్యాఖ్యాతగా, అనేక ప్రభుత్వ కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా పనిచేసి అపర్ణ ప్రసిద్ధి చెందారు. 1998లో దీపావళి వేడుకల్లో భాగంగా ఏకంగా ఎనిమిది గంటల పాటు షోలో ప్ర‌ద‌ర్శ‌న ఇచ్చి రికార్డు సృష్టించింది.

ఆమె 1984లో పుట్టన్న కనగల్ చివరి చిత్రం ‘మసనాద హూవు’తో సినీ రంగ ప్రవేశం చేసింది. అనేక కన్నడ టీవీ షోలలో నటించింది. బెంగళూరు మెట్రో ప్రకటనలలో కూడా అపర్ణ వాయిస్ వినిపిస్తుంది. ఆమె కన్నడ రియాలిటీ టెలివిజన్ షో బిగ్ బాస్‌లో కనిపించింది. పాపులర్ కామెడీ షో 'మజా టాకీస్'లో 'వరలక్ష్మి' పాత్రలో ఆమె ప్రజల మ‌న్న‌న‌లు పొందింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సహా పలువురు సినీ, టెలివిజన్, సాహిత్య, రాజకీయ ప్రముఖులు అపర్ణా వస్తారే మృతికి సంతాపం తెలిపారు.

Eha Tv

Eha Tv

Next Story