బాలీవుడ్‌ వివాదాస్పద నటి కంగనా రనౌత్‌(Kangana Ranut) నటించిన ఎమర్జెన్సీ(Emergency) సినిమా వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటోంది. తనే రాసి, దర్శకత్వం వహించి నిర్మించిన ఎమర్జెన్సీ సినిమా నిజానికి కిందటేడు నవంబర్‌లోనే విడుదల కావాలి. అప్పుడు వాయిదా పడింది, ఆ తర్వాత జూన్‌ 14న విడుదల చేస్తామని పేర్కొంది. ఇప్పుడు ఆ డేట్‌న కూడా రిలీజవ్వడం లేదు. తదుపరి అధికారిక తేదీని త్వరలో ప్రకటిస్తామని కంగనా టీమ్‌ చెప్పింది.

బాలీవుడ్‌ వివాదాస్పద నటి కంగనా రనౌత్‌(Kangana Ranut) నటించిన ఎమర్జెన్సీ(Emergency) సినిమా వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటోంది. తనే రాసి, దర్శకత్వం వహించి నిర్మించిన ఎమర్జెన్సీ సినిమా నిజానికి కిందటేడు నవంబర్‌లోనే విడుదల కావాలి. అప్పుడు వాయిదా పడింది, ఆ తర్వాత జూన్‌ 14న విడుదల చేస్తామని పేర్కొంది. ఇప్పుడు ఆ డేట్‌న కూడా రిలీజవ్వడం లేదు. తదుపరి అధికారిక తేదీని త్వరలో ప్రకటిస్తామని కంగనా టీమ్‌ చెప్పింది. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ(Indhra gandhi) బయోపిక్‌గా ఈ సినిమా తెరకెక్కింది. ప్రస్తుతం కంగనా రాజకీయాల్లో బిజీగా ఉంది. హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి నియోజకవర్గం నుంచి బీజేపీ(BJP) తరపున పోటీ చేస్తున్న కంగనా రెండు రోజుల కిందట పది లక్షల మంది అభిమానుల సమక్షంలో నామినేషన్‌ వేశారు. ఎన్నికలలో బిజీగా ఉన్నందుకు సినిమా విడుదల తేదీని వాయిదా వేశామని చెబుతున్నారు. ఇటీవలి కాలంలో కంగనా నటించిన సినిమాలన్నీ అట్టర్‌ఫ్లాప్‌ అయ్యాయి. ఈ సినిమా కూడా డమాల్ అంటుందేమోనన్న భయం కంగనాను వదలడం లేదు. ఆస్తిపాస్తులన్నీ తనఖా పెట్టి సినిమా తీస్తున్నానని గతంలో కంగనా చెప్పారు. ఇందిరాగాంధీ పాత్రలో కంగనా నటిస్తుంటే, జయప్రకాశ్‌ నారాయణ్‌ పాత్రలో అనుపమ్‌ ఖేర్‌, మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ పాత్రలో శ్రేయస్ తల్పడే కనిపించనున్నారు.

Updated On 16 May 2024 5:26 AM GMT
Ehatv

Ehatv

Next Story