సంచలనాలకు మారుపేరు కంగనా రనౌత్‌(Kangana Ranaut).. తరచూ ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూ ఉంటారు. బీజేపీకి(BJP) అనుకూలంగా వ్యవహరిస్తూ ప్రత్యర్థులపై విమర్శలు సంధిస్తూ ఉంటారు. అలాగే సోషల్‌ మీడియాలో(Social media) యాక్టివ్‌గా ఉంటూ సమాజలో జరిగే సంఘటనపై స్పందిస్తూ ఉంటారు. టాలీవుడ్‌ నుంచి బాలీవుడ్‌ వరకు ఆమె ఎదుర్కొన్న వివాదాలకు లెక్కే లేదు. మంచి నటి కూడా.

సంచలనాలకు మారుపేరు కంగనా రనౌత్‌(Kangana Ranaut).. తరచూ ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూ ఉంటారు. బీజేపీకి(BJP) అనుకూలంగా వ్యవహరిస్తూ ప్రత్యర్థులపై విమర్శలు సంధిస్తూ ఉంటారు. అలాగే సోషల్‌ మీడియాలో(Social media) యాక్టివ్‌గా ఉంటూ సమాజలో జరిగే సంఘటనపై స్పందిస్తూ ఉంటారు. టాలీవుడ్‌ నుంచి బాలీవుడ్‌ వరకు ఆమె ఎదుర్కొన్న వివాదాలకు లెక్కే లేదు. మంచి నటి కూడా. అందుకే జాతీయ అవార్డులు(National Award) ఆమెను వరించాయి. నటిగా(Actress), నిర్మాతగా(Producer), దర్శకురాలిగా(Director) తనకంటూ ఓ ముద్ర వేసుకున్నారు. లేటెస్ట్‌గా ఇందిరా గాంధీ(Indra Gandhi) పరిపాలన, నాటి సంఘటనలతో రూపొందిస్తున్న ఎమర్జెన్సీ(Emergency) సినిమాలో లీడ్‌ రోల్‌ను పోషిస్తున్నారు కంగనా రనౌత్‌. అంటే ఇందిరాగాంధీ పాత్ర అన్న మాట. అంతే కాదు ఈ సినిమాకు దర్శకత్వం కూడా వహిస్తున్నారు. తమిళంలో ఇప్పటికే ధామ్‌ ధూమ్‌(Dham Dhum), తలైవి(Thalaivi) చిత్రాలలో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు.

అక్కడ కూడా ఆమెకు అవకాశాలు వస్తున్నాయి కానీ తమిళ సినిమాల అవకాశాలను ఆమె తిరస్కరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇంతకు ముందు నటుడు శింబు(Shimbu) సరసన నటించే అవకాశాన్ని నిరాకరించిన కంగనా రనౌత్‌ ఇప్పుడు ధనుష్‌(Dhanush) సినిమాలో హీరోయిన్‌గా నటించే అవకాశాన్ని వదులుకున్నారు. ధనుష్‌ పాన్‌ వరల్డ్‌ నటుడు అన్న విషయం కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ధనుష్‌లో అపారమైన టాలెంట్‌ కూడా ఉంది. ఇప్పటికే నటుడిగా, గాయకుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా విజయవంతం అయ్యారు. తాజాగా ఆయన తన 50 సినిమాలో నటించడానికి రెడీ అవుతున్నారు. ఈ సినిమాకు ఈయనే డైరెక్టర్‌. సన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో అతిరథ మహరథులు నటిస్తున్నారు. ఇందులో ధనుష్‌కు జోడిగా కంగనా రనౌత్‌ను తీసుకోవాలని చిత్ర యూనిట్‌ అనుకుంది. ఆ మేరకు ఆమెను అప్రోచ్‌ అయ్యింది. అయితే ఆమె మాత్రం కాల్‌షీట్స్‌ సమస్య అంటూ సినిమాను చేయనని చెప్పేశారు. దీంతో ధనుష్‌ తన 50వ సినిమాలో హీరోయిన్‌గా త్రిషను ఎపిక చేసుకున్నారు. మరో సౌత్‌ హీరోకు కూడా కంగనా హ్యాండ్‌ ఇచ్చారంటూ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Updated On 13 Jun 2023 12:56 AM GMT
Ehatv

Ehatv

Next Story