బాలీవుడ్‌ ఫైర్‌బ్రాండ్‌ కంగనా రనౌత్‌(Kangana Ranaut) ఎవరినీ లెక్క చేయరు. తను చెప్పాలనుకున్నది సూటిగా నిర్మోహమాటంగా చెప్పేస్తారు. అందుకే తరచూ వివాదాల్లో చిక్కుకుంటూ ఉంటారు. ఆ మధ్యన కరణ్‌ జోహర్‌ను(Karan Johar) బాగా విమర్శించారు. అసలు కరణ్‌ జోహార్‌, కంగనా రనౌత్‌ మధ్య బద్ధ విరోధం ఉంది.

బాలీవుడ్‌ ఫైర్‌బ్రాండ్‌ కంగనా రనౌత్‌(Kangana Ranaut) ఎవరినీ లెక్క చేయరు. తను చెప్పాలనుకున్నది సూటిగా నిర్మోహమాటంగా చెప్పేస్తారు. అందుకే తరచూ వివాదాల్లో చిక్కుకుంటూ ఉంటారు. ఆ మధ్యన కరణ్‌ జోహర్‌ను(Karan Johar) బాగా విమర్శించారు. అసలు కరణ్‌ జోహార్‌, కంగనా రనౌత్‌ మధ్య బద్ధ విరోధం ఉంది. బాలీవుడ్‌ యువ హీరో సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌(sushanth singh rajput) ఆత్మహత్య తర్వాత కరణ్‌జోహార్‌ను టార్గెట్‌ చేస్తూ కంగనారనౌత్‌ అనేక విమర్శలు, పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. బాలీవుడ్‌పై కరణ్‌ జోహార్‌ గుత్తాధిపత్యం చేస్తున్నారని కంగనా చాలా సార్లు చెప్పారు. గత మూడేళ్లుగా వీరిద్దరి మధ్య శత్రుత్వం కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో కంగనా రనౌత్‌ నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఎమర్జెన్సీ(emergency) సినిమా గురించి కరణ్‌ జోహర్‌ నాలుగు మంచి మాటలు మాట్లాడటం బాలీవుడ్‌ను ఆశ్చర్యపరచింది.

ప్రధానమంత్రి ఇందిరాగాంధీ(Indra Gandhi) దేశవ్యాప్తంగా విధించిన ఎమర్జెన్సీ నేపథ్యంలో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా కోసం తాను ఉత్సాహంగా ఎదురుచూస్తున్నానని కరణ్‌జోహార్‌ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు అయితే కరణ్‌జోహర్‌ మాటలను కంగనా చాలా లైట్‌గా తీసుకున్నారు. మణికర్ణిక విడుదల సమయంలో కరణ్‌ జోహార్‌ ఇలాగే మాట్లాడాడని, తర్వాత సినిమాపై ఉద్దేశపూర్వకంగా దుష్ర్పచారం చేశాడని చెప్పారు కంగనా. ఆనాటి రోజులను తానెప్పుడూ మర్చిపోనని, తన జీవితంలో అవి పీడకలగా మిగిలిపోయాయని అన్నారు. ' ఇప్పుడు అదే కరణ్‌ జోహార్‌ ఎమర్జెన్సీ సినిమాను పొగుడుతున్నాడు. అంటే మళ్లీ ఏదో ఉపద్రవం రాబోతుందని అర్థమవుతున్నది’ అని కంగనా రనౌత్‌ వ్యంగంగా అన్నారు. కరణ్‌జోహార్‌ పొగడ్తలను కూడా కంగనారనౌత్‌ సీరియస్‌గా తీసుకున్నారని, వీరిద్దరి మధ్య మళ్లీ సయోధ్య కుదరడం ఇంపాజిబుల్‌ అని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.

Updated On 23 Aug 2023 7:45 AM GMT
Ehatv

Ehatv

Next Story