ఎప్పుడూ ఏదో ఒక వివాదాన్ని నెత్తినేసుకునే బాలీవుడ్‌ క్వీన్‌ కంగనా రనౌత్‌(Kangana Ranaut) గురించి కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదు. బాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న కంగనా రనౌత్‌ ప్రస్తుతం చంద్రముఖి-2(chnadramukhi-2), ఎమర్జెన్సీ(emergency) , తేజస్‌(Tejas) చిత్రాల్లో నటిస్తోంది. లేటెస్ట్‌గా మరోసారి నోరు పారేసుకుంది. తన సినిమాల బాక్సాఫీస్‌ కలెక్షన్ల(Box Office Collections) గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడింది.

ఎప్పుడూ ఏదో ఒక వివాదాన్ని నెత్తినేసుకునే బాలీవుడ్‌ క్వీన్‌ కంగనా రనౌత్‌(Kangana Ranaut) గురించి కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదు. బాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న కంగనా రనౌత్‌ ప్రస్తుతం చంద్రముఖి-2(chnadramukhi-2), ఎమర్జెన్సీ(emergency) , తేజస్‌(Tejas) చిత్రాల్లో నటిస్తోంది. లేటెస్ట్‌గా మరోసారి నోరు పారేసుకుంది. తన సినిమాల బాక్సాఫీస్‌ కలెక్షన్ల(Box Office Collections) గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడింది. దీని వెనుక ఓ మాఫియా ముఠా ఉందని న ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో(Instagram stories) రాసుకొచ్చింది. 'దేవుడా అలాంటి వారి ఆత్మకు శాంతి కలిగించు' అంటూ వ్యంగ్యంగా కామెంట్‌ పెట్టింది. తన సినిమాలపై వ్యతిరేక ప్రచారం చేస్తూ శునకానందం పొందుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది.

'నేను నటించిన సినిమాలలో 150 కోట్ల రూపాయలు వసూలు చేసిన చిత్రాలను కూడా ఫ్లాప్‌ అంటూ రాస్తున్నారు. ఇతరుల పట్ల ఇలాంటి నీచమైన ఆలోచనలు ఎలా వస్తాయి? వీటి కోసం పగలు, రాత్రి ప్లాన్‌ చేసి, ఇతరులను చెడుగా చూపించడానికి వారు సొంత డబ్బును ఖర్చు చేస్తున్నారు' అంటూ కంగనా రనౌత్‌ అన్నారు. 2015లో సన్నీ డియోల్‌తో కలిసి కంగనా రనౌత్‌ నటించిన ఐ లవ్‌ న్యూ ఇయర్‌ సినిమా బాక్సాఫీసు దగ్గర చతికిలపడింది. ఈ చిత్రం తర్వాత కంగనా కెరీర్‌ ముగిసిపోయిందనే వార్తలు వచ్చాయి. అయితే లేటెస్ట్‌గా సన్నీ డియోల్‌ నటించిన గదర్‌-2 సినిమా భారీ ఓపెనింగ్స్‌ రాబడుతుందని కంగానా ఆశాభావం వ్యక్తం చేసింది. అంతేకాదు సన్నీ డియోల్‌కు నేను ఓ పెద్ద అభిమానిని అని చెప్పింది. కాగా గతంలో తనపై గూఢచర్యం చేస్తున్నారని ఆలియాభట్, రణ్‌బీర్‌ కపూర్‌లపై ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

Updated On 9 Aug 2023 8:04 AM GMT
Ehatv

Ehatv

Next Story