తను వెడ్స్‌ మను(Tanu Weds Manu) సినిమా ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందులో హీరో మాధవన్‌(Madhavan), హీరోయిన్‌ కంగనా రనౌత్‌(Kangana Ranaut)లే నటించారు. నాలుగేళ్ల తర్వాత ఆ సినిమాకు సీక్వెల్‌గా తను వెడ్స్‌ మను రిటర్న్స్‌ వచ్చింది. ఇందులో కూడా మాధవన్‌, కంగనా రనౌత్‌లు హీరో హీరోయిన్లుగా నటించారు. అలైప్పాయుదే సినిమా ద్వారా తమిళ సినీ పరిశ్రమకు పరిచయమైన మాధవన్‌ చాక్లెట్‌ బాయ్‌గా గుర్తింపు పొందాడు.

తను వెడ్స్‌ మను(Tanu Weds Manu) సినిమా ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందులో హీరో మాధవన్‌(Madhavan), హీరోయిన్‌ కంగనా రనౌత్‌(Kangana Ranaut)లే నటించారు. నాలుగేళ్ల తర్వాత ఆ సినిమాకు సీక్వెల్‌గా తను వెడ్స్‌ మను రిటర్న్స్‌ వచ్చింది. ఇందులో కూడా మాధవన్‌, కంగనా రనౌత్‌లు హీరో హీరోయిన్లుగా నటించారు. అలైప్పాయుదే సినిమా ద్వారా తమిళ సినీ పరిశ్రమకు పరిచయమైన మాధవన్‌ చాక్లెట్‌ బాయ్‌గా గుర్తింపు పొందాడు. ఆ సినిమా తర్వాత అన్ని రకాల పాత్రలు పోషించాడు. ఇక కంగానా రనౌత్‌ గురించి ఏం చెబుతాం? బాలీవుడ్‌లో ఆమె ఓ సంచలనం. మొన్నీమధ్యనే తమిళంలో తలైవి అనే సినిమాలో దివంగత ముఖ్యమంత్రి జయలలిత పాత్రలో నటించారు. తమిళంలోనూ అభిమానులను ఏర్పరుచుకున్నారు. మాధవన్‌, కంగన ఇద్దరూ బహుభాషా నటులే. ఇద్దరూ దర్శకులుగా కూడా పని చేశారు. 2015లో తను వెడ్స్‌ మను రిటర్న్స్‌ సినిమా వచ్చింది. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి పని చేయలేదు. ఎనిమిదేళ్ల విరామం తర్వాత ఈ జంట ముచ్చటగా మూడోసారి కలిసి నటించబోతున్నది. ఇది తమిళ సినిమా కావడం విశేషం. ఈ సినిమాను ట్రైడెంట్‌ ఆర్ట్స్‌ సంస్థ అధినేత రవీంద్రన్‌ పాన్‌ ఇండియా స్థాయిలో నిర్మించబోతున్నారు. ఇటీవల వచ్చిన అయోథి సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న దర్శకుడు మూర్తినే ఈ సినిమాను డైరెక్ట్‌ చేయబోతున్నారు. ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం ఎంపిక జరుగుతున్నది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది.

Updated On 6 Jun 2023 12:29 AM GMT
Ehatv

Ehatv

Next Story