లోక నాయకుడు కమలహాసన్‌ ఇప్పుడు జెట్‌ స్పీడ్‌లో దూసుకుపోతున్నారు. లాస్టియర్‌ ఆయన నటించిన విక్రమ్‌ సినిమా రికార్డు కలెక్షన్లను రాబట్టింది. హిట్‌ కోసం చాన్నాళ్లుగా ఎదురుచూస్తున్న కమల్‌కు ఈ సినిమా సరికొత్త ఎనర్జీని ఇచ్చింది. ఆ సినిమా విజయవంతం కావడంతో కమల్‌ కాల్షీట్ల కోసం నిర్మాతలు క్యూలు కడుతున్నారు.

లోక నాయకుడు కమలహాసన్‌ ఇప్పుడు జెట్‌ స్పీడ్‌లో దూసుకుపోతున్నారు. లాస్టియర్‌ ఆయన నటించిన విక్రమ్‌ సినిమా రికార్డు కలెక్షన్లను రాబట్టింది. హిట్‌ కోసం చాన్నాళ్లుగా ఎదురుచూస్తున్న కమల్‌కు ఈ సినిమా సరికొత్త ఎనర్జీని ఇచ్చింది. ఆ సినిమా విజయవంతం కావడంతో కమల్‌ కాల్షీట్ల కోసం నిర్మాతలు క్యూలు కడుతున్నారు. కమల్‌ కూడా వరుసగా కొత్త సినిమాలకు పచ్చాజెండా ఊపుతున్నారు. ప్రస్తుతం శంకర్‌ దర్శకత్వంలో ఇండియన్‌-2 షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్‌ చివరి దశకు వచ్చేసింది. అలాగే ప్రభాస్‌తో కలిసి ప్రాజెక్ట్‌ కెలో నటిస్తున్నారు. నాయగన్‌ తర్వాత మణిరత్నంలో కమల్‌ ఏ సినిమా చేయలేదు. ఇప్పుడు మణిరత్నంతో కూడా ఓ సినిమా చేయబోతున్నారు. నాయగన్‌ తెలుగులో నాయకుడు పేరుతో డబ్‌ అయి ఇక్కడ కూడా ఘన విజయాన్ని సాధించింది. వీటితో పాటు ఆయన 233వ సినిమాను అధికారికంగా ప్రకటించారు. హెచ్‌. వినోద్‌ దర్శకత్వంలో ఈ సినిమా ఉంటుందనే టాక్‌ వినిపించింది. ఫైనల్‌గా అదే నిజమైంది. ఈ సినిమాను రాజ్‌కమల్‌ ఫిలింస్‌ ఇంటర్నేషనల్‌ పతాకంపై ఆర్‌.మహేంద్రన్‌తో కలిసి కమలహాసన్‌ స్వయంగా నిర్మిస్తున్నారు.
‘‘అండ్‌ ఇట్‌ బిగిన్స్‌. రైజ్‌ టు రూల్‌’ అంటూ ఓ వీడియో ద్వారా సినిమాను ప్రకటించారు కమల్‌. ఇందులో కమలహాసన్‌ శాసించే వ్యక్తిగా ఓ పవర్‌ఫుల్‌ పాత్రలో కనిపిస్తారు. కార్తితో ఖాకి సినిమాను రూపొందించిన హెచ్‌.వినోద్‌ ఆ తర్వాత అజిత్‌తో వరుసగా మూడు సినిమాలు చేశారు. ఇప్పుడు కమల్‌తో చేస్తుండటంతో సినిమా అంచనాలు అమాంతం పెరిగాయి.

Updated On 5 July 2023 2:08 AM GMT
Ehatv

Ehatv

Next Story