ఇండస్ట్రీలో చాలా సింపుల్ గా ఉండే స్టార్ వైఫ్ లలో జూనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మి ప్రణతి ఒకరు. ఆమె చాలా సింపుల్ గా ఉంటారు. తారక్ తో తపపించి బయట ఎక్కడా పెద్దగా కనిపించరు. సోషల్ మీడియాలో మాత్రం కాస్త యాక్టీవ్ గానే ఉంటుంది లక్ష్మీ ప్రణతి ఇక తాజాగా ఆమె చార్మినార్ నైట్ బజార్ ను సందర్శించారు. నైట్ బజార్ లో షాపింగ్ కూడా చేశారు. ప్రణతి ఒక్కరే చాలా సింపుల్ గా వచ్చి షాపింగ్ చేయడం ఆసక్తికరంగా మారింది.

టాలీవుడ్‏లో ఉన్న క్యూట్ కపుల్స్ లో ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతి జంట కూడా ముందు వరుసలో ఉంటారు. తారక్ ను అర్ధం చేసుకుని.. ఆయనకు తగ్గట్టు ఉండటంలో.. లక్ష్మీ వంద శాతం మార్కులుసాధించారు. ఇక తాజాగా ఆమె చార్మినార్ నైట్ బజార్ లో షాపింగ్ చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.

ఇండస్ట్రీలో చాలా సింపుల్ గా ఉండే స్టార్ వైఫ్ లలో జూనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మి ప్రణతి ఒకరు. ఆమె చాలా సింపుల్ గా ఉంటారు. తారక్ తో తపపించి బయట ఎక్కడా పెద్దగా కనిపించరు. సోషల్ మీడియాలో మాత్రం కాస్త యాక్టీవ్ గానే ఉంటుంది లక్ష్మీ ప్రణతి ఇక తాజాగా ఆమె చార్మినార్ నైట్ బజార్ ను సందర్శించారు. నైట్ బజార్ లో షాపింగ్ కూడా చేశారు. ప్రణతి ఒక్కరే చాలా సింపుల్ గా వచ్చి షాపింగ్ చేయడం ఆసక్తికరంగా మారింది.

చార్మినార్ నైట్ బజార్ లో ఎన్టీఆర్ భార్యను చూసిన అభిమానులు వెంటనే తమ ఫోన్లకు పనిచేప్పారు. ఈ సందర్భంగా పలువురు అభిమానులు ఫొటోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. తాజాగా లక్ష్మి ప్రణతికి సంబంధించిన ఓ ఫొటో నెట్టింట వైరల్ గా మారింది. ఆ ఫొటోను చూసిన ఎన్టీఆర్ అభిమానులు వరుసగా షేర్ చేస్తున్నారు. అంతే కాదు ఈ పోస్ట్ లకు వదినమ్మ అని టాక్ చేస్తూ.. వదినమ్మ క్యాప్షన్ ను వైరల్ చేస్తున్నారు. ప్రణీత ఇలా షాపింగ్ చేస్తూ కనిపించడంతో అభిమానులుదిల్ ఖుష్ అవుతున్నారు.

గ్లోబల్ స్టార్ తా ఎన్టీఆర్ ఎదిగినా.. ఆయన భార్య లక్ష్మి ప్రణతి చాలా సింపుల్ గా ఉంటారు ఆ సింపుల్సిటీతోనే జనాల మధ్య షాపింగ్ చేయడంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు. హార్షం వ్యాక్తం చేస్తున్నారు. ఆమె సింప్లిసిటీని మెచ్చుకుంటున్నారు. అయితే సినిమా ఈవెంట్లలో, ఫంక్షన్లలోనూ పెద్దగా కనిపించని ప్రణీత ఇలా దర్శనవివ్వడంతో తారక్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

ఇక ఎన్టీఆర్ - ప్రణతిల పెళ్లి 2011లో గ్రాండ్ గా జరిగింది. అప్పట్లోనే ఇండస్ట్రీ అంతా గొప్పగా చెప్పుకునేలా చాలా వైభవంగా జరిగింది వీరి పెళ్లి వేడుక. రియల్ ఎస్టేట్ కంపెనీ ఓనర్,, పొలిటీషియన్ కమ్ బిజినెస్ మెన్ నార్నే శ్రీనివాస్ రావు కూతురు లక్ష్మీ ప్రణతీ. ఇక వీరికి ఇద్దరు తనయులు కాగా వారు భార్గవ్ రామ్, అభయ్ రామ్. తారక్ కు ఎప్పుడు టైమ్ దొరికినా కూడా.. వీరితో టైమ్ స్పెండ్ చేయడానికి చూస్తాడు. ఫ్యామిలీతో ఫారెన్ టూర్లు కూడా వేస్తాడు.

ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో NTR30లో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈమూవీ తరువాత తారక్ కెజియఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో పాన్ ఇండియా మూవీ చేయబోతున్నాడు. ఆర్ఆర్ఆర్ తో ఆస్కార్ హీరో అయ్యాడు తారక్. గ్లోబల్ ఇమేజ్ సాధించడంతో.. బాలీవుడ్ లో కూడా ఆయన ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది.

Updated On 17 April 2023 7:51 AM GMT
Ehatv

Ehatv

Next Story