పూజా కార్యక్రమంతో 'ఎన్టీఆర్31'

ప్రశాంత్‌ నీల్‌(Prashanth neel) దర్శకత్వంలో జూ.ఎన్టీఆర్‌(Jr.NTR) హీరోగా అత్యంత ప్రతిష్టాత్మక నిర్మిస్తున్న 'ఎన్టీఆర్‌31'(NTR 31) సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. రామానాయుడు స్టూడియోస్‌లో ఘనంగా ఈ పూజా కార్యక్రమం జరిగింది. మైత్రీ మూవీ మేకర్స్‌(Mythri movie makers) ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. పూజా కార్యక్రమంలో ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్‌ కుటుంబసభ్యులు పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో తిరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని అందరూ ఓ యాక్షన్‌ మూవీ అని అనుకుంటారని ఊహించాను. ఇది భిన్నమైన భావోద్వేగాలతో వైవిధ్యభరితంగా ఈ సినిమా ఉంటుందని ప్రశాంత్‌ నీల్‌ అన్నారు. తనకు ఇది చాలా కొత్త కథని ఆయన అన్నారు. 2026 జనవరి 9 ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందని చిత్ర బృందం తెలిపింది. కేజీఎఫ్‌, సలార్‌ సినిమాల విజయంతో దూసుకెళ్తున్న ప్రశాంత్‌ నీల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండడంతో ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే 'ఎన్టీఆర్‌31' వర్కింగ్‌ టైటిల్‌తో వస్తున్న ఈ మూవీకి డ్రాగన్‌(Dragon) అనే పేరు ఖరారు చేశారని సమాచారం. అయితే ఇది అధికారికంగా ప్రకటించలేదు. రెండు భాగాలుగా ఈ చిత్రాన్ని నిర్మిస్తారని వార్తలు వస్తున్నాయి.

Eha Tv

Eha Tv

Next Story