కేజీఎఫ్‌(KGF) సినిమాలతో ఒక్కసారిగా అగ్రశ్రేణి దర్శకుడుగా మారిపోయిన ప్రశాంత్‌ నీల్‌(Prashant neel) ఇటీవల విడుదలైన సలార్‌తో(Salaar) తన సత్తా ఏమిటో ప్రూవ్‌ చేసుకున్నాడు. ఇప్పుడు ఎన్టీఆర్‌తో(NTR) ఓ మూవీ చేస్తున్నాడు.

కేజీఎఫ్‌(KGF) సినిమాలతో ఒక్కసారిగా అగ్రశ్రేణి దర్శకుడుగా మారిపోయిన ప్రశాంత్‌ నీల్‌(Prashant neel) ఇటీవల విడుదలైన సలార్‌తో(Salaar) తన సత్తా ఏమిటో ప్రూవ్‌ చేసుకున్నాడు. ఇప్పుడు ఎన్టీఆర్‌తో(NTR) ఓ మూవీ చేస్తున్నాడు. లేటెస్ట్‌గా ప్రశాంత్‌ నీల్‌ను యంగ్‌ టైగర్‌ కలిశారు. శుక్రవారం ప్రశాంత్‌ నీల్‌ ఇంట్లో జరిగిన శుభకార్యానికి ఎన్టీఆర్‌ తన సతీమణితో కలిసి అటెండ్‌ అయ్యారు. ఎన్టీఆర్‌ దంపతులతో పాటు మైత్రీ మూవీ మేకర్స్‌ అధినేత యలమంచలి రవి శంకర్‌(Yalamanchali Ravi shankar) కూడా అక్కడికి వెళ్లారు. ఇదే కార్యక్రమానికి కాంతారా హీరో రిషబ్‌ షెట్టి కూడా తన భార్య ప్రగతితో వచ్చారు. అక్కడ వారంతా కలిసి దిగిన గ్రూపు ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఎన్టీఆర్‌తో ప్రశాంత్‌ నీల్ రూపొందించబోయే సినిమా ప్రస్తుతం పేపర్‌వర్క్‌ కంప్లీట్‌ చేసుకుంది.

Updated On 2 March 2024 3:46 AM GMT
Ehatv

Ehatv

Next Story