హిందీలో వచ్చిన 'బద్రీ కీ దుల్హనియా' , 'హంప్టీ శర్మ కీ దుల్హనియా' చిత్రాల్లో వరుణ్‌ ధావన్, ఆలియా భట్‌ హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ రెండు సినిమాలు భారీ విజయాన్ని సాధించాయి. ఈ చిత్రాలకు శశాంక్‌ కేతన్‌ దర్శకత్వం వహించారు. తాజాగా 'దుల్హనియా 3' సెట్స్‌పైకి వెళ్లేందుకు కేతన్‌ ప్రయత్నాలు మొదలు పెట్టారని బాలీవుడ్‌ సమాచారం.

హిందీలో వచ్చిన 'బద్రీ కీ దుల్హనియా'(Badri Ki Dulhania), 'హంప్టీ శర్మ కీ దుల్హనియా' (Humpty Sharma Ki Dulhania) చిత్రాల్లో వరుణ్‌ ధావన్(Varun Dhawan), , ఆలియా భట్‌(Alia Bhatt) హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ రెండు సినిమాలు భారీ విజయాన్ని సాధించాయి. ఈ చిత్రాలకు శశాంక్‌ కేతన్‌ దర్శకత్వం(Shashank Ketan Direction) వహించారు. తాజాగా 'దుల్హనియా 3' సెట్స్‌పైకి వెళ్లేందుకు కేతన్‌ ప్రయత్నాలు మొదలు పెట్టారని బాలీవుడ్‌ సమాచారం. వరుణ్‌ ధావన్, ఆలియా భట్‌లను కూడా సంప్రదించారట. అయితే వరుణ్‌ ధావన్‌ అందుకే రెడీగానే ఉన్నప్పటికీ..అలియాభట్ మాత్రం అందుకు నో చెప్పిందట. ఇప్పటికే అంగీకరించిన చిత్రాల కారణంగా ఆలియా ఈ సినిమాలో నటించలేకపోతున్నానని చెప్పారని తెలుస్తోంది. దీంతో ఆ ఛాన్స్ జాన్వీ కపూర్(Janhvi Kapoor) కొట్టేసిందట. అంతేకాదు.. ఈ సినిమాకు సంబంధించిన ప్రీప్రొడక్షన్‌ వర్క్స్‌ ఊపందుకున్నాయని టాక్‌ వినిపిస్తోంది. ఈ వేసవిలో షూటింగ్‌ ఆరంభించాలనుకుంటున్నారని సమాచారం. తాజా సమాచారం ప్రకారం.. బ్లాక్ బ‌స్టర్ ఫ్రాంచైజీలో కొత్త 'దుల్హనియా' పాత్రలో జాన్వీ న‌టించ‌నుంది. విజయవంతమైన ఫ్రాంఛైజీలో ఆలియా నటించకపోవడానికి కారణం తీరిక లేని షెడ్యూళ్లతో ఉండ‌డ‌మేనని ఊహాగానాలు సాగుతున్నాయి. శశాంక్ ఖైతాన్ దర్శకత్వంలో 'దుల్హనియా 3' మునుపటి భాగాలకు ఏ విధంగానూ కనెక్ట్ కాని..ఒక విభిన్న కథాంశంతో తెరకెక్కనున్నట్టు తెలుస్తోంది.

Updated On 14 Jan 2024 4:55 AM GMT
Ehatv

Ehatv

Next Story