జాన్వీ కపూర్ తండ్రి, బోనీ కపూర్ ఒక ఇంటర్వ్యూలో ఈ వార్తలను ధృవీకరించారు

జాన్వీ కపూర్‌ బాలీవుడ్ లో ఫుల్ బిజీ షెడ్యూల్ లో గడుపుతూ ఉంది. ఆమె నటించిన సినిమాలు మూడు విడుదలకు సిద్ధమవుతూ ఉన్నాయి. ఇక ఆమె ఎన్టీఆర్ తో ‘దేవర’ సినిమా చేస్తోంది. ఆ సినిమా తర్వాత మరో తెలుగు చిత్రంలో నటించడానికి సిద్ధంగా ఉంది. రామ్ చరణ్‌తో బుచ్చి బాబు సనా దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చింది. జాన్వీ కపూర్ పుట్టినరోజు సందర్భంగా, నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్‌తో ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ ను అధికారికంగా షేర్ చేసింది.

జాన్వీ కపూర్ తండ్రి, బోనీ కపూర్ ఒక ఇంటర్వ్యూలో ఈ వార్తలను ధృవీకరించారు. ఆయన మాట్లాడుతూ “నా కూతురు ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్‌తో సినిమా షూటింగ్ చేస్తోంది. ఆమె ఆ సినిమా సెట్స్‌లో గడిపే రోజులో ప్రతి క్షణాన్ని ప్రేమిస్తుంది. త్వరలో రామ్ చరణ్‌తో కూడా ఓ సినిమా ప్రారంభించనుంది. ఆమె చాలా తెలుగు సినిమాలు చూస్తోంది, ఆ సినిమాలలో కలిసి పనిచేయడం తన అదృష్టంగా భావిస్తోంది. ఆ సినిమాలు హిట్ అయి.. ఆమెకు మరింత పని లభిస్తుందని ఆశిస్తున్నాను. త్వరలో సూర్యతో కూడా నటించనుంది. నా భార్య (శ్రీదేవి) పలు భాషల్లో నటించింది, నా కూతురు కూడా అలాగే చేస్తుందని ఆశిస్తున్నాను." అని తెలిపారు.

జాన్వీ కపూర్ చివరిసారిగా వరుణ్ ధావన్‌తో కలిసి 'బవాల్'లో కనిపించింది. జాన్వీకి ‘RC 16’, ‘దేవర’ కాకుండా, రాజ్‌కుమార్ రావు సరసన ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’, సుధాన్షు సరియాకు సంబంధించి ‘ఉలజ్’, వరుణ్ ధావన్ సరసన ‘సన్నీ సంస్కారీ కి తులసి కుమారి’ సినిమాల్లో నటిస్తోంది.

Updated On 6 March 2024 12:49 AM GMT
Yagnik

Yagnik

Next Story