ఒక్కసారి మచ్చపడిన తర్వాత దాన్ని తుడిపేసుకోవడం చాలా కష్టం. సెలబ్రిటీలకు మరింత కష్టం. ఇప్పుడు బాలీవుడ్‌ నటి జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ (Jacqueline Fernandez) పరిస్థితి కూడా ఇలాగే ఉంది. సుకేశ్‌ చంద్రశేఖర్‌ (Sukesh Chandrashekhar) మనీలాండరింగ్‌ కేసు వెలుగులోకి వచ్చినప్పటి నుంచి జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ పేరు మీడియాలో నలుగుతూ వస్తోంది. చంద్రశేఖర్‌తో జాక్వెలిన్‌ ఫ్రెండ్‌షిప్‌ గురించి కూడా కథనాలు వచ్చాయి. ఇప్పుడు ఆమె కొత్త ఇల్లు కొన్నారు. అంతే.. మళ్లీ పాత హిస్టరీ అంతా తవ్వుతూ ఉన్నారు.

ఒక్కసారి మచ్చపడిన తర్వాత దాన్ని తుడిపేసుకోవడం చాలా కష్టం. సెలబ్రిటీలకు మరింత కష్టం. ఇప్పుడు బాలీవుడ్‌ నటి జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ (Jacqueline Fernandez) పరిస్థితి కూడా ఇలాగే ఉంది. సుకేశ్‌ చంద్రశేఖర్‌ (Sukesh Chandrashekhar) మనీలాండరింగ్‌ కేసు వెలుగులోకి వచ్చినప్పటి నుంచి జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ పేరు మీడియాలో నలుగుతూ వస్తోంది. చంద్రశేఖర్‌తో జాక్వెలిన్‌ ఫ్రెండ్‌షిప్‌ గురించి కూడా కథనాలు వచ్చాయి. ఇప్పుడు ఆమె కొత్త ఇల్లు కొన్నారు. అంతే.. మళ్లీ పాత హిస్టరీ అంతా తవ్వుతూ ఉన్నారు. ఆమె ఇల్లు కొన్నది ఎక్కడో కాదు ముంబాయిలోని ఖరీదైన ప్రాంతంలో.. బాలీవుడ్‌ సూపర్‌స్టార్లు షారూక్‌ ఖాన్‌, సల్మాన్‌ ఖాన్‌, రణబీర్‌ కపూర్‌-ఆలియాభట్‌, కరీనా కపూర్‌-సైఫ్‌ అలీఖాన్‌ వంటి టాప్‌ స్టార్లు ఉండే ప్రాంతంలోనే మర్డర్‌-2 బ్యూటీ జాక్వెలిన్‌ ఇంటిని కొనుక్కుంది. ఇదే ప్రాంతంలో దీపికా పదుకొనే, రణవీర్‌సింగ్‌లు కూడా ఇదే ఏరియాలో ఇల్లు తీసుకునే ఆలోచనలో ఉన్నారట. తాజాగా జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ కొత్త ఇంటి వీడియోలతో పాటు ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ముంబాయిలోని బాంద్రా ప్రాంతంలో ఉండే పాలి హిల్‌లో ఇంటిని కొనుగోలు చేశారు జాక్వెలిన్‌. ఈ ప్రాంతంలో ట్రిపుల్‌ బెడ్‌రూమ్‌ ఫ్లాట్‌ కొనాలంటే మినిమమ్‌ 12 కోట్ల రూపాయలు అవుతుంది. మరి జాక్వెలిన్‌ ఎన్ని బెడ్‌రూమ్స్‌ ఉన్న ఫ్లాట్‌ను కొన్నారో, ఎంత డబ్బు పెట్టి కొన్నారో ఇంకా తెలియదు. కానీ సుమారు 20 కోట్ల రూపాయలతో కొనుగోలు చేసినట్టు ప్రచారం జరుగుతోంది. జాక్వెలిన్‌ కొత్త ఇంటికి సంబంధించిన వీడియో బయటకు రావడంతో నెటిజన్లు తలోతీరుగా కామెంట్లు చేస్తున్నారు. బహుశా సుకేశ్‌ చంద్రశేఖర్‌ గిఫ్ట్‌గా ఇచ్చాడేమోని ఒకరు, ఇదంతా సుకేశ్‌ నుంచి వచ్చిన ప్రాప్తం అని మరొకరు కామెంట్‌చేశారు. మరొకరు సుకేశ్‌ డబ్బుతోనా లేకపోతే సల్మాన్‌ భాయ్‌ డబ్బుతోనా అంటూ వ్యాఖ్యానించాడు. 200 కోట్ల రూపాయల మనీ లాండరింగ్‌ కేసులో ప్రధాన నిందితుడైన సుకేశ్‌ చంద్రశేఖర్‌ నుంచి జాక్వెలిన్‌ ఖరీదైన బహుమతులు అందుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ కేసులో జాక్వెలిన్‌కు మధ్యంతర బెయిల్‌ మంజూరైన సంగతి తెలిసిందే. సుకేశ్‌ చంద్రశేఖర్‌ మాత్రం జైలులోనే ఉన్నాడు.

Updated On 3 July 2023 12:22 AM GMT
Ehatv

Ehatv

Next Story