నటి, యాంకర్‌ అనసూయ మళ్లీ హాట్‌ టాపిక్‌ అయ్యారు. ఆమె చేసిన ఓ ట్వీట్‌ ఆమె గురించి చర్చించేలా చేసింది. ' నా పేరు లేకుండా పాపం ఏదీ చెప్పలేకపోతున్నారు' అంటూ అనసూయ భరద్వాజ్‌ చేసిన ట్వీట్‌(Tweet) ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఎవరిని ఉద్దేశించి అనసూయ ఈ వ్యాఖ్యలు చేశారో చెప్పకపోవడంతో నెటిజన్లు కన్‌ఫ్యూజ్‌ అవుతున్నారు. కామెంట్ల రూపంలో ఆమెను ప్రశ్నిస్తున్నారు.

నటి, యాంకర్‌ అనసూయ(anasuya) మళ్లీ హాట్‌ టాపిక్‌ అయ్యారు. ఆమె చేసిన ఓ ట్వీట్‌ ఆమె గురించి చర్చించేలా చేసింది. ' నా పేరు లేకుండా పాపం ఏదీ చెప్పలేకపోతున్నారు' అంటూ అనసూయ భరద్వాజ్‌ చేసిన ట్వీట్‌(Tweet) ఇప్పుడు సోషల్‌ మీడియాలో(social Media) తెగ వైరల్‌ అవుతోంది. ఎవరిని ఉద్దేశించి అనసూయ ఈ వ్యాఖ్యలు చేశారో చెప్పకపోవడంతో నెటిజన్లు కన్‌ఫ్యూజ్‌ అవుతున్నారు. కామెంట్ల రూపంలో ఆమెను ప్రశ్నిస్తున్నారు. ‘మళ్లీ ఏమైంది మేడమ్‌?’, ‘మిమ్మల్ని ఎవరు ఏమన్నారు?’ అని అడుగుతున్నారు. అనసూయ తన ట్వీట్‌లో ఇంకా చాలా అన్నారు. 'వావ్‌! నేను నిజంగా చాలా చాలా ముఖ్యమైనదాన్ని. నా ప్రమేయం ఉన్నా లేకున్నా, నాకు సంబంధం ఉన్నా లేకున్నా.. నా పేరు ఎత్తకుండా ఒక్క డిస్కషన్‌ కూడా జరగదంటే.. నాపై అంత డిపెండ్‌ అయి ఉన్నారు. నా పేరు లేకుండా పాపం ఏదీ చెప్పలేకపోతున్నారు’’ అని అనసూయ రాశారు. ఇంతకు ముందు కూడా పలు సందర్భాలలో అనసూయ పెట్టిన ట్వీట్‌లు దుమారం రేపాయి.

ఇటీవల ఓ హీరో కొత్త సినిమా పోస్టర్‌ రిలీజ్‌ అయ్యింది. దానిపై సోషల్‌ మీడియాలో అనసూయ తన అభిప్రాయం తెలిపారు. అంతే.. ఆ హీరో ఫ్యాన్స్‌ నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదురయ్యాయి. సినిమా పోస్టర్‌ రిలీజ్‌ అయినప్పుడు, ప్రచార చిత్రాలు వచ్చినప్పుడు, సినిమాలు విడుదలైనప్పుడు ఆమె ట్వీట్‌ చేస్తుంటారు. మొన్ననే తన సోదరుడు విజయ్‌ దేవరకొండ(Vijay devarkonda), అనసూయ మధ్య ఏర్పడిన వివాదం గురించి ఆనంద్‌ దేవరకొండ మాట్లాడారు. వ్యక్తిగతంగా అనసూయపై తనకు ఎలాంటి కోపమూ లేదన్నారు. 'నెగటివ్‌, లేదా పాజటివ్‌.. ఇప్పటివరకూ ఏదైతే జరిగిందో అది పూర్తిగా వారికి సంబంధించిన విషయం. వ్యక్తిగతంగా ఆమెపై నాకు ఎలాంటి కోపం లేదు. నా ఫ్యామిలీని రక్షించుకోవడానికి నేను ఎప్పుడూ ముందుంటా' అని ఆనంద్‌(Anand Devarkonda) అన్నారు. ' మా ట్రైలర్‌ నచ్చిదంటూ అనసూయ ట్వీట్‌ చేయడం సంతోషంగా అనిపించందన్నారు.

Updated On 15 July 2023 1:30 AM GMT
Ehatv

Ehatv

Next Story