ఈమధ్య ఎంత ఫాస్ట్ గా పెళ్లి చేసుకుంటున్నారో.. అంతే ఫాస్ట్ గా విడాకులు కూడా తీసుకుంటున్నారు. అటు వెండితెరపై స్టార్లు.. సూపర్ స్టార్లే కాదు.. ఇటు బుల్లితెరపై చిన్న తారలు కూడా విడాకులవైపు పరుగులుపెడుతున్నారు. ఈక్రమంలో ఓ బుల్లితెర జంట డివోర్స్ తీసుకుంటున్నట్టు న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ జంట ఎవరు..? ఈ న్యూస్ లో నిజం ఎంతా అనేది చూస్తే..?

ఈమధ్య ఫిల్మ్ ఇండస్ట్రీలో విడాకులు కేసలు ఎక్కువైపోయాయి. వెండితెరతోపాటు.. బుల్లితెరపై కూడా పెళ్లిళ్ల సందడిపెరిగింది. విడాకుల హడావిడి కూడా పెరిగింది. ఇక తాజాగా మరో బుల్లితెర జంట డివోర్స్ తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది.

ఈమధ్య ఎంత ఫాస్ట్ గా పెళ్లి చేసుకుంటున్నారో.. అంతే ఫాస్ట్ గా విడాకులు కూడా తీసుకుంటున్నారు. అటు వెండితెరపై స్టార్లు.. సూపర్ స్టార్లే కాదు.. ఇటు బుల్లితెరపై చిన్న తారలు కూడా విడాకులవైపు పరుగులుపెడుతున్నారు. ఈక్రమంలో ఓ బుల్లితెర జంట డివోర్స్ తీసుకుంటున్నట్టు న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ జంట ఎవరు..? ఈ న్యూస్ లో నిజం ఎంతా అనేది చూస్తే..?

పటాస్ షో ద్వారా సామాన్యుడిగా ఎంటర్ అయ్యి.. సెలబ్రిటీ అయ్యాడు యాదమ్మ రాజు (Yadamma Raju). అతని కామెడీ టైమింగ్ ఆడియన్స్ కు కడుపుబ్బా నవ్వు తెప్పిస్తుంది. ఎంతో మంది యాదమ్మ రాజుకు అభిమానులుగా మారిపోయారు. పటాస్ తరువాత.. ఎన్నో బుల్లితెర షోలు చేసిన ఆయన.. ప్రస్తుతం జబర్థస్త్ (Jabardasth) తో పాటు.. శ్రీదేవి డ్రామా కంపెనీ.. షోలతో ఆడియన్స్ ను నవ్విస్తున్నాడు.

యాదమ్మ రాజు పోయిన ఏడాది ప్రేమ పెళ్ళి చేసుకున్నాడు. తన ప్రేమించిన స్టెల్లాతో పెళ్ళి తరువాత కూడా.. ఇద్దరు కలిసి వీడియోలు గట్రా చేసుకుంటూ..హ్యాపీగా ఉన్నారు. ఎన్నో షోలలో కలిసి సందడి చేశారు. అయితే తాజాగా వీరిద్దరు విడిపోతున్నారంటూ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అయితే ఈ న్యూస్ లో ట్విస్ట్ ఏంటంటే.. ఈ విడాకులు డ్రామా వారు శ్రీదేవి డ్రామా కంపెనీ (Sri Devi Drama Company) కోసం ఆడినట్టు తెలుస్తోంది. ఈ షోలో ప్రతీ వారం ఏదో ఓక థీమ్ మీద కామెడీ షో జరుగుతుంది. ఈవారం వీరిద్దరు విడాకులు అంటూ థీమ్ తీసుకుని షో చేసినట్టు సమాచారం. ఈక్రమంలో ఈ వార్తలు వైరల్ అవుతుండగా.. ఈ ట్విస్ట్ ఊహాంచని ప్రేక్షకులు థ్రిల్ ఫీల్ అవుతున్నారు.

Updated On 29 Jun 2023 1:31 AM GMT
Ehatv

Ehatv

Next Story